ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి, మంత్రి రోజా చీరలు పంపిస్తారట. ఇదేం దిక్కుమాలిన రాజకీయం.? అని అంతా ముక్కున వేలేసుకుంటుండగానే, మంత్రి రోజాకి ‘కట్ డ్రాయర్లు’ టన్నుల లెక్కన పంపిస్తామని టీడీపీ నాయకుడొకరు మీడియా ముందుకొచ్చి గొప్ప ప్రకటన చేసేస్తాడు. వారెవ్వా.! రాజకీయం అంటే ఇలా వుండాలి.! నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు తయారైంది అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తీరు.
మంత్రి అయ్యాక కాస్తంత ఇంగితం ప్రదర్శించాలన్న కనీస సోయ లేకుండా మంత్రి రోజా, తన స్థాయిని దిగజార్చేసుకుని మరీ చంద్రబాబుకీ, నారా లోకేష్కీ చీరలు పంపిస్తామని సెలవివ్వడమే దారుణం. ఆమెకు కట్ డ్రాయర్లు.. అదేనండీ చెడ్డీలు పంపిస్తామనడం ఇంకా దారుణం. దానికన్నా దారుణమేంటంటే, వీటి గురించి చర్చించుకోవాల్సి రావడం.
సినిమాల్లో గ్లామర్ కోసం రోజా బికినీల్లో కనిపించినంతమాత్రాన, ఈ వయసులో ఆమె పేరు ప్రస్తావిస్తూ, ‘బికినీ పంపిస్తాం..’ అని టీడీపీ నేత అనడమేంటి.? ఇంకో అడుగు ముందుకేసి.. చెడ్డీలు.. అవేనండీ కట్ డ్రాయర్లు కావాలా.? టన్నుల కొద్దీ వున్నాయ్.. పంపిస్తాం.. అని టీడీపీ నేత నిస్సిగ్గుగా మాట్లాడమేంటి.?
రాష్ట్ర అభివృద్ధి కోసం పర్యాటక శాఖ మంత్రిగా ప్రజలకు తాను ఏం చేయాలనుకుంటున్నదీ మంత్రి రోజా చెప్పాల్సి వుంటుంది. కానీ, ఆమె ఆ విషయాన్ని పక్కన పెట్టి, ప్రతిపక్ష నేత మీద అవాకులు చెవాకులు పేలి, తద్వారా అధినేత మెప్పు పొందాలని కక్కుర్తి పడ్డారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
అంతకు మించి, టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి తన స్థాయిని దిగజార్చేసుకున్నారు. ఓ మహిళా మంత్రి విషయంలో ఆయన మాట్లాడాల్సిన భాషేనా ఇది.? ఒకర్ని మించి ఇంకొకరు దిగజారిపోతూ, రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తున్నారు టీడీపీ, వైసీపీ నేతలు. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రాన్ని బూతుల ప్రదేశ్గా మార్చేస్తున్నారు.
146296 290046All you need to have to know about News info to you. 58256