జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ‘అప్పు రత్న’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని వైసీపీ హయాంలో అప్పుల కుప్పగా మార్చేశారన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణ.
‘రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. మీ ఆస్తిపాస్తులేమో పెరుగుతున్నాయ్.. వైసీపీ నేతల ఆస్తులూ పెరుగుతున్నాయ్.. రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం పడుతోంది..’ అంటూ పవన్ కళ్యాణ్ సవివరంగా ఆ సెటైర్లో పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఓ పేద రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు.. మరింత పేద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చేస్తున్నారని జనసేన అధినేత అంటున్నారు.
సహజంగానే వైసీపీ నుంచి కౌంటర్ ఎటాక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ మీద చేయడానికి విమర్శలేమీ కొత్తగా వుండవు వైసీపీకి. జనసేన అధినేతకి ‘కళ్యాణ రత్న’ అని బిరుదునిచ్చేసింది వైసీపీ. సరే, ‘కళ్యాణ రత్న’ అనే అనుకుందాం. కానీ, ఆ పెళ్ళిళ్ళ వల్ల సమాజానికి వచ్చిన నష్టమేంటి.? అందునా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఇబ్బందేంటి.? ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన అదనంగా అర్థ రూపాయి అయినా భారం పడిందా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వల్ల.!
వైసీపీ నేతల వద్ద పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి ‘మూడు పెళ్ళిళ్ళు’ తప్ప వేరే కంటెంట్ ఏదీ వుండదని ఇంకోసారి తేలిపోయింది.
‘మేం అప్పులు చేయడంలేదు.. ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం కాదు.. రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం లేదు..’ అని వైసీపీ చెప్పగలదా.? ఛాన్సే లేదు. ఎందుకంటే, అప్పు నిజం.. రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పు భారమూ నిజం. అన్నిటికీ మించి.. వైసీపీ నేతల ఆస్తులు పెరుగుతున్నాయన్నదీ నిజం.
రాష్ట్రంలో అప్పు రత్న వర్సెస్ కళ్యాణ రత్న.. అనే అంశంపై లోతైన చర్చే జరుగుతోంది. అప్పుల వల్ల నష్టమా.? పెళ్ళిళ్ళ వల్ల నష్టమా.? అన్నదానిపై ప్రజలకూ ఖచ్చితమైన అవగాహన వుంది. వైసీపీ ఎమ్మెల్యేల్లోనూ అవగాహన పెరుగుతోంది.. అందుకే, వైసీపీని వీడుతున్నారు.
909344 988930Superb post but I was wanting to know if you could write a litte a lot more on this subject? Id be really thankful in case you could elaborate a bit bit far more. Thanks! 969311
470811 21949Im so happy to read this. This really is the type of manual that needs to be given and not the accidental misinformation thats at the other blogs. Appreciate your sharing this greatest doc. 163682