ముఖ్యమంత్రిగా వున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, భారతీయ జనతా పార్టీతో నాలుగేళ్ళు అంటకాగి, అదే పార్టీ మీద ఆ తర్వాత విమర్శలు చేసిన విషయం విదితమే. బీజేపీని, తెలంగాణ రాష్ట్ర సమితిని చంద్రబాబు టార్గెట్గా చేసుకుని ఎన్నికల ప్రచారంలో నానా రకాల వ్యాఖ్యలూ చేశారు.
ఫలితం ఏమయ్యింది.? దారుణమైన పరాజయం మిగిలింది తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అంతే. గడచిన మూడేళ్ళలో మూడు రాజధానులు కట్టేశామనో, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేశామనో, కడప స్టీలు ప్లాంటు తెచ్చేశామనో, దుగరాజుపట్నం పోర్టు తెచ్చేశామనో చెప్పలేక.. ‘దత్త పుత్రుడు’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు.
వైసీపీకి సంబంధించిన వేదికలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తే, అది రాజకీయం. కానీ, అధికారిక కార్యక్రమాల్లో, సంక్షేమ పథకాలు అమలు చేసే బహిరంగ సభల సాక్షిగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం ద్వారా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన స్థాయి తగ్గించేసుకుంటున్నారు.
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏ తప్పు అయితే చేశారో, అదే తప్పుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంతకన్నా ఘనంగా చేసేస్తున్న దరిమిలా, 2024 ఎన్నికల్లో వైసీపీకి రాబోయే సీట్లు ఎన్ని.? అన్నదానిపై జనబాహుళ్యంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితమైపోతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబుకి జనసేనాని దత్తపుత్రుడట.! అసలేమన్నా అర్థముందా వైఎస్ జగన్ విమర్శల్లో.? ఏ రకంగా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడట.? సినిమాల్లో సంపాదంచే కోట్లాది రూపాయలకు మించి, పవన్ కళ్యాణ్కి ప్యాకేజీ ఇవ్వగల సత్తా చంద్రబాబుకి వుందా.? అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికైనా వుందా.?
ఇదీ జన బాహుళ్యంలో ‘దత్తపుత్రుడు’ వ్యవహారంపై జరుగుతున్న చర్చ. తిరిగి వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే ‘సీబీఐ దత్త పుత్రుడు.. చంచల్ గూడా జైలు షటిల్ బ్యాచ్..’ అని జనం, ముఖ్యమంత్రిపై రచ్చబండల్లో వెటకారాలు చేసే పరిస్థితి వచ్చేసింది.
886226 691617Extremely intriguing topic , appreciate it for putting up. 87537
364422 825012This blog actually is great. How was it made ? 577115