కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పొగిడేందుకే మెగాస్టార్ చిరంజీవితోపాటు మహేష్బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరులు హైద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళారా.? తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ తర్వాత సినీ పరిశ్రమకు దక్కిన ఊరట ఏంటి.? ఈ అంశాలపై సినీ, రాజకీయ వర్గాల్లో బోల్డంత చర్చ జరుగుతోంది.
సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు సృష్టించిందే వైఎస్ జగన్ ప్రభుత్వం. సినిమా టిక్కెట్ల ధరల్ని తగ్గించేశారు.. థియేటర్లలో తనిఖీల పేరిట, నిబంధనల ఉల్లంఘన పేరిట కీలకమైన సమయంలో కొన్ని థియేటర్లను మూసేశారు. అంతకు ముందు ‘వకీల్ సాబ్’ సినిమాకి కల్పించిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు.
సమస్యకు కారణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకా ఆ సమస్య సమసిపోలేదు. ప్రభుత్వం సృష్టించిన సమస్య నుంచి తమకు ఊరట కావాలని సినీ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే, టిక్కెట్ల ధరల విషయంలో కావొచ్చు, ఇంకో విషయంలో కావొచ్చు.. పరిశ్రమకు ఊరటైతే దక్కలేదు.
ఈ నెలాఖరులోపు సానుకూలంగా జీవో వస్తుందని సీఎం జగన్తో భేటీ తర్వాత చిరంజీవి వ్యాఖ్యానించినప్పటికీ, అదెంతవరకు వాస్తవరూపం దాల్చుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తే, భూములు ఇవ్వడానికి సిద్ధమని వైఎస్ జగన్ ప్రభుత్వం చెప్పింది. వీళ్ళు వెళ్ళినప్పుడు, వాళ్ళు ఇచ్చినప్పటి ముచ్చట అది.
ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులంటున్నారు.. ఎప్పుడూ జరిగే వ్యవహారమే అది. తమిళ సినిమాలు, హిందీ సినిమాలు కూడా ఆంధ్రప్రదేశ్లోనూ షూటింగులు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఎలా చూసినా, నిన్నటి భేటీ తర్వాత సినీ పరిశ్రమకు కలిగిన అదనపు ఊరట ఏంటి.? అనంటే, దానికి సమాధానం దొరకడంలేదు.
‘చేతులు జోడించి అడుగుతున్నా..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందర, పరిశ్రమ తరఫున చిరంజీవి చేసిన విజ్ఞప్తి చాలామంది గుండెల్ని తాకింది. ‘పరిశ్రమ బాగు కోసం చిరంజీవి ఇంతలా పరితపిస్తున్నారు..’ అన్న భావన జనంలోకి వెళ్ళింది తప్ప, పరిశ్రమ పట్ల కాస్తయినా ‘జాలి’ జగన్ సర్కారు చూపిస్తుందన్న నమ్మకం మాత్రం ఎవరికీ కలగలేదు.
639193 697256Extremely interesting subject , appreciate it for posting . 103683
180033 679966This internet page may be a walk-through like the data you wanted concerning this and didnt know who want to. Glimpse here, and you will surely discover it. 136742