ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి బాగా మొండిమనిషని పేరు. ఆ మొండితనమే అతనికి ఎన్నో కష్టాలను అధిగమించి సీఎం పీఠం దక్కేలా చేసిందన్నది విమర్శకుల అభిప్రాయం. ఎన్ని అవాంతరాలెదురైనా వెనక్కితగ్గటం అంటే ఆయనకు ఇష్టం ఉండదన్నది ఆంతరంగికుల మాట.
ఇలాంటి జగన్మోహనరెడ్డికి ఇప్పుడు కొంత గడ్డుకాలం నడుస్తోంది. దీనికి సైతం ఆ మొండితనమే కారణమన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. దీంతో తను అనుకున్నవి అనుకున్నట్లు జరగటం లేదన్న ఫ్రస్ట్రేషన్ ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికలకు ముందు రాజధాని అమరావతికి జై కొట్టిన జగన్, ఆ తర్వాత ప్లేటు ఫిరాయించి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు.
దాంతో అప్పటివరకూ రేగిన ఇసుక దుమారాన్ని దాటుకుని నెమ్మదిగా గాడిలో పడుతోందనుకుంటున్న పాలన కాస్తా గందరగోళంలో పడింది. సుమారు 150 రోజులుగా రాజధాని రైతుల ఆందోళనలు ఓవైపు సాగుతోంటే మరోవైపు పాలనాపరంగా తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఇంకా హైకోర్టు చుట్టూనే తిరుగుతున్నాయి.
ఇక కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసుకునే రాజధాని తరలింపు నిర్ణయాన్ని తీసుకున్నారన్న విమర్శల్ని ఎదుర్కొంటూనే వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేసుకోవాలని వైసీపీ అధిష్టానం ఉవ్విళ్లూరింది. అయితే వారి దూకుడుకు వరుస బ్రేకులు పడుతూనే ఉన్నాయి.
ఓవైపు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మంత్రాంగం, తన ఆలోచనలను సమర్ధంగా ముందుకు తీసుకెళ్లలేని యంత్రాంగం మరోవైపు జగన్ ఆలోచనల్ని కోల్డ్ స్టోరేజ్ కు పంపాయి. రాజధాని తరలింపుపై ఆ ప్రాంత రైతులు కోర్టుకి ఎక్కడం, మే నెలాఖరుకు కేపిటల్ తరలింపు జరగుతున్నట్లు వార్తలు వస్తున్నాయనీ, తమకు న్యాయం చేయమని కోర్టును కోరిన నేపధ్యంలో ప్రభుత్వం తప్పక వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
న్యాయ, శాసనపరమైన అంశాలన్నీ ముగిసిన తర్వాతనే తరలింపు ఉంటుందనీ, అప్పటివరకూ ఎలాంటి ముందడుగు లేదనీ కోర్టుకు అఫిడవిట్ ద్వారా తేల్చిచెప్పింది. దీంతో ఉన్నపళంగా విశాఖపట్నానికి రాజధాని తరలింపు ఉంటుంది, ఇప్పటికే 20 ట్రక్కుల ఫర్మిచర్ ఉంది, స్థానికంగా విజ్జాన్ కళాశాల సమీపంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం రెడీ అవుతోందన్న వార్తలకు తాత్కాలికంగా ప్రభుత్వం చెక్ పెట్టినట్లయింది.
కానీ జగన్ మాత్రం వీలైనంత త్వరగానే ఇక్కడి నుండి మకాం మార్చాలని భావిస్తున్నారు. చంద్రబాబు తాలూకు గత పాలనా ప్రభావం పడకుండా తనదైన మార్క్ చూపాలని ఆయన భావిస్తున్నారు. బాబు హయాంలో నిర్మించిన భవనాల్లో తాను అడుగుపెట్టేందుకు ఇష్టపడటం లేదన్నది సీఎంఓ వర్గాల సమాచారం.
మరి అలా జరిగితే వందల కోట్ల ప్రజాధనం వృధా అంటారా..? కాదని మేం ఎందుకంటాం…? ఉండవల్లి చంద్రబాబు నివాసం సమీపంలో కోట్లరూపాయల విలువైన ప్రజావేదికను నిలువునా కూల్చేసినపుడు అయ్యో అనుకున్నవాళ్లే చాలామంది ఉన్నారు. సరే, వాటి గురించి మళ్లీ మాట్లాడుకుందాం…మొత్తానికి కరోనా విపత్తు, వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రమాదఘటన జరగకపోయి ఉంటే ఈపాటికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ సమీక్షలు విశాఖలోనే జరిగి ఉండేవి.
అయిననూ విశాఖకూ పోవాల్సిందేనన్న జగన్ ఆదేశాలను అమలుచేసేందుకు, అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసేందుకు ఆయన ఆంతరంగికులు విజయసాయిరెడ్డి,ఇతర మంత్రులంతా దిండూ, దుప్పట్లు పట్టుకుని మకాంలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తన జగమొండితనాన్ని వీడి అన్ని ప్రాంతాల ప్రజలను సంతృప్తిపరిచేలా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలా కాదంటారా…? ఇక మీ ఇష్టం..రాష్ట్ర ప్రజల్నీ, రాష్ట్రాన్నీ మీరు తరచుగా చెప్పే దేవుడే కాపాడాలి. శుభం భుయాత్..
8363 375481I truly appreciate this post. Ive been looking all over for this! Thank goodness I found it on Bing. Youve produced my day! Thank you once again.. 344631
435671 874024Someone necessarily assist to make critically articles Id state. This really is the initial time I frequented your web page and thus far? I amazed with the analysis you produced to make this actual submit incredible. Excellent activity! 969381
274410 888155Ive just been talking to Sean Gallagher about his upcoming Instant Income Cash Machine course, and hes been kind enough to fill me in on some details regarding his upcoming course. 713954
67471 790669An attention-grabbing dialogue is value comment. Im positive that its better to write on this topic, towards the often be a taboo topic but typically persons are not sufficient to speak on such topics. To yet another location. Cheers 273990