మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం విడుదలై ఇటీవల 30 ఏళ్లు అయిన సందర్బంగా పెద్ద ఎత్తున సినిమా గురించిన ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. దర్శకుడు రాఘవేంద్ర రావు, నిర్మాత అశ్వినీదత్ ఇంకా చిరంజీవిలు తమ అనుభవాలను మీడియాతో షేర్ చేసుకున్నారు. అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం బడ్జెట్ విషయంలో మరియు కలెక్షన్స్ విషయంలో ఇండస్ట్రీ రికార్డును పొందింది.
ఇక ఆ సినిమాలో నటించినందుకు గాను చిరంజీవికి 35 లక్షలు శ్రీదేవికి 25 లక్షలు పారితోషికంగా ఇచ్చారట. అప్పట్లో ఇది రికార్డు స్థాయి పారితోషికంగా చెప్పుకునేవారు. చిరంజీవి అంతకు ముందు వరకు పాతిక లక్షల నుండి 30 లక్షల వరకు పారితోషికం తీసుకునేవాడు. శ్రీదేవి 10 నుండి 15 లక్షల పారితోషికం తీసుకునేది. కాని ఈ సినిమాకు ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి రావడంతో పాటు భారీ బడ్జెట్ చిత్రం అవ్వడంతో అశ్వినీదత్ ఈ సినిమాకు వారికి భారీ పారితోషికం ఇచ్చాడట.
జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం తర్వాత చిరంజీవి తన పారితోషికంను అమాంతం పెంచేశాడు. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం పొందనంత పారితోషికంను ఈయన సొంతం చేసుకున్నాడు. ఇండియాలో మొదటి కోటి పారితోషికం తీసుకున్న స్టార్గా అప్పట్లో చిరంజీవి రికార్డు సృష్టించాడు. చిరంజీవి కోటి పారితోషికం దక్కించుకోవడంకు జగదేక వీరుడు అతిలోక సుందరి కారణం అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.
521769 678319I see something genuinely fascinating about your internet web site so I saved to bookmarks . 392261
805203 878158never saw a web site like this, relaly impressed. compared to other blogs with this write-up this was definatly the very best internet site. will save. 885673
223806 985821I really like reading through and I think this site got some genuinely utilitarian stuff on it! . 716629
977318 574484You got a very great web site, Gladiolus I discovered it through yahoo. 87883