‘ఇందులో బేషజాలకు పోవాల్సిన అవసరమేముంది.? తప్పులు ఎవరైనా చేస్తారు.. ఆ తప్పుని సరిదిద్దుకోవడం ముఖ్యం. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 8 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితిని ముందే ఊహించి, రాష్ట్ర ప్రజల్ని కాపాడిన గొప్ప వ్యక్తి నిమ్మగడ్డ రమేష్కుమార్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఆయన ఆ రోజు పరిస్థితుల్ని అంచనా వేసి కరోనా ప్రబలకుండా స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. లేకపోతే, పరిస్థితి ఇంకెంత ప్రమాదకరంగా వుండేదో.! ఆయనకు క్షమాపణ చెప్పి, తిరిగి ఆయన్ని ఆయన పదవిలో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి తన హుందాతనాన్ని కాపాడుకోవాలి..’ ఇదీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యల సారాంశం.
‘రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముందు మరో ఆప్షన్ లేదు. నిమ్మగడ్డ రమేష్కుమార్ని తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ ఆదేశాలివ్వడం మంచిది..’ అంటూ ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ అభిప్రాయపడ్డారు. నిమ్మగడ్డ విషయమై ఈ రోజు సుప్రీంకోర్టులో మరోమారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురయిన నేపథ్యంలో అటు రఘురామకృష్ణరాజు, ఇటు జంధ్యాల రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను సంచలనంగా మారాయి.
మరోపక్క, తనపై అనర్హత వేటు వేయించాలన్న అత్యుత్సాహంతో ప్రభుత్వ ఖర్చులతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి, ఎంపీల్ని ఢిల్లీకి పంపించడం హాస్యాస్పదమని రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ‘నేను పార్టీని పల్లెత్తు మాట కూడా అనలేదు..’ అంటూ ఇంకోసారి తనదైన స్టయిల్లో రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడం గమనార్హం. గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వంపై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేస్తుండడం, ఈ క్రమంలో ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేయడమే కాదు, ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్సభ స్పీకర్కి వైసీపీ ఫిర్యాదు కూడా చేసింది. అయితే, రఘురామకృష్ణరాజు మాత్రం ‘డోన్ట్ కేర్’ అనేస్తున్నారు.
కాగా, ‘కోర్టుల తీర్పుల్ని లెక్కచేయం.. అని ఇదివరకటిలా అంటే కుదరదు.. ఇకపై పరిస్థితులు ఇంకోలా వుంటాయ్..’ అని హెచ్చరించారు రఘురామకృష్ణరాజు.
521247 515724A thoughtful insight and concepts I will use on my website. Youve certainly spent some time on this. Congratulations! 360989