ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ స్పీడు పెంచింది. అనుమానితులు, ఫోన్ కాల్స్.. వంటి అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చసేందుకు టెక్నికల్ టీమ్ తో రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు కడప ఎస్పీ అన్బురాజన్ ను కలిశారు. అక్కడినుంచి పులివెందులకు వెళ్లనున్నారు. 2019లో సాధారణ ఎన్నికల ముందు జరిగిన వివేకా దారుణ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వివేకా ఇంట్లోనే కొందరు ఆయన్ను అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచాలని ఆయన కుమార్తె సునీత పోరాటమే చేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని అప్పట్లో జగన్ తో కలిసి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. కానీ.. జగన్ అధికారంలోకి వచ్చాక ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు నిరాకరించారు. అయతే.. వివేకా కుమార్తె ఈ హత్యలో పలువురు వైసీపీ నేతల పాత్ర ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె సీబీఐ దర్యాప్తు కావాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. హత్య జరిగిన పరిస్థితులు అనంతర పరిణామాలను పరిశీలించి ఈ కేసును సీబీఐకు అప్పగించింది హైకోర్టు.
ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. సాంకేతిక బృందంతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు విషయమై పులివెందులకు కూడా వెళ్లనున్నరు సీబీఐ అధికారులు. దీంతో ఈ కేసు విషయంలో నెలకొన్న సందిగ్దం త్వరలోనే తెలిసేలా ఉంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు హత్య జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఇప్పటికే 1300 మంది అనుమానితులను కూడా విచారించారు పోలీసులు.
913379 408440Youre so cool! I dont suppose Ive learn something like this before. So nice to search out any person with some distinctive thoughts on this topic. realy thank you for starting this up. this internet internet site is one thing thats necessary on the net, someone with a bit of originality. useful job for bringing something new towards the internet! 646965
434092 363773Taylor Lautner By the way you may want to look at this cool internet site I found 825682
372772 771509Wow! This can be one specific of the most beneficial blogs We have ever arrive across on this subject. Really Fantastic. Im also an expert in this subject so I can understand your hard function. 505520