వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు కూడా సౌమ్యుడే.. చాలా బుద్ధిమంతుడు కూడా.!
ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో, మొదటి నుంచీ అభ్యర్థుల పరిచయం దాదాపుగా ఇలానే సాగుతోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుకని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తూ, ‘ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే’ అని వైఎస్ జగన్ చెప్పేసరికి, నోటితో మాత్రం నవ్వలేకపోయారు వైసీపీ క్యాడర్. ఆర్థికంగా ఆమె అంతటి ఉన్నత స్థానంలో వున్నారన్న విషయం అందరికీ తెలుసు మరి.!
అంబటి రాంబాబు సౌమ్యుడా.? అన్నా రాంబాబు సౌమ్యుడా.? అన్నా రాంబాబు బూతుల వ్యవహారం సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే వుంది. ఆయన కారణంగా ఓ సామాన్యుడు ప్రాణాలు కోల్పోయాడు కూడా. కాదు కాదు, అది హత్య.. అనే ఆరోపణలూ వున్నాయ్.!
ఇప్పటిదాకా వైసీపీ అభ్యర్థుగా జగన్ పరిచయం చేసిన నాయకులందరికి సంబంధించిన ‘అసలు వీడియోలు’ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే వున్నాయి. ఎవరి ఆస్తులు ఎంత.? ఎవరి సౌమ్యత ఎంత.? అన్నదానిపై లెక్కలు పక్కగానే వున్నాయ్.! అయినాగానీ, వైఎస్ జగన్, రాష్ట్ర ప్రజల్ని ఎలా ఏమార్చాలనుకుంటున్నారట.?
అభ్యర్థుల్ని పరిచయం చేయడానికి, వేరే మార్గాలుంటాయ్. సింగిల్ స్క్రిప్ట్ పేపర్ పట్టుకుని, రాష్ట్రమంతా బస్సు యాత్ర చేసేస్తే, ఇదిగో ఇలాగే తగలడుతుంది వ్యవహారం.! దీన్నే సెల్ఫ్ ట్రోలింగ్ అని కూడా అనుకోవచ్చేమో.!