నో డౌట్.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్లో శోభా శెట్టి పేరు ముందు వరుసలోనే వుంటుంది. కానీ, హౌస్లో ఇతర కంటెస్టెంట్లతో కలిసి మెలిసి వుండటంలో మాత్రం, ఆమెకు మైనస్ మార్కులే పడతాయేమో. ఆటిట్యూడ్తోనే అసలు సమస్య.
‘గెలవడానికి వచ్చాను.. మీతో మంచి సంబంధాలు పెట్టుకోవడానికి రాలేదు..’ అని పదే పదే కంటెస్టెంట్లతో చెబుతుంటుంది శోభా శెట్టి. హౌస్లో గెలవాలంటే, తోటి కంటెస్టెంట్ల సహాయ సహకారాలు ప్రతి ఒక్క కంటెస్టెంటుకీ అవసరమే.! ఆ లాజిక్ ఎలా మర్చిపోతోందామె.! కౌశల్కి కుదిరినట్లు, అన్ని సీజన్లలోనూ అందరు కంటెస్టెంట్లకూ కుదరలేదు. కౌశల్ వ్యవహారం వేరు.
కెప్టెన్సీ ఎవరిది.? అన్న విషయమై జరిగిన చివరి టాస్క్లో కంటెస్టెంట్లందరి మద్దతునీ కెప్టెన్సీ కంటెండర్లు పొందాల్సి వుంది. కానీ, శోభా శెట్టికి చాలామందితో సమస్యలున్నాయి. వాటిని ఆమె సార్ట్ ఔట్ చేసుకోలేకపోయింది. చిన్న చిన్న విషయాలకే ఇరిటేట్ అవుతూ వస్తోంది.
ఫలితంగా, కెప్టెన్సీ టాస్క్లో శోభా శెట్టికి షాక్ తగిలింది. మరీ ముఖ్యంగా ప్రిన్స్ యావర్ ఆమె మెడలో ఎండు మిర్చి మాల వేసే క్రమంలో హైడ్రామా క్రియేట్ చేసిన వైనం, శోభా శెట్టిని ‘వెంటనే ఎలిమినేట్ చేసెయ్యండి’ అనే స్థాయికి బిగ్ బాస్ వ్యూయర్స్ వెళ్ళేలా చేసింది.
‘పిచ్చోడు..’ అంటూ పదే పదే యావర్ మీద మాట తూలింది శోభా శెట్టి. ఇదొక్కటి చాలు, ఇంకో మాట లేకుండా శోభా శెట్టిని హౌస్ నుంచి బయటకు పంపించెయ్యడానికి. కానీ, బిగ్ బాస్ అలా చేస్తాడా.? నాగార్జున రేపు పీకబోయే క్లాస్ ఎలా వుంటుంది.?
ఇదిలా వుంటే, గౌతమ్ కెప్టెన్ అయ్యాడు. బహుశా గౌతమ్ కూడా ఇది ఊహించి వుండడమే. చివర్లో శివాజీ స్మార్ట్ ప్లే కారణంగా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా గౌతమ్ కెప్టెన్ అయిపోయాడు. వచ్చేవారం కెప్టెన్సీ టాస్క్లో సందీప్కి మద్దతిస్తానని ప్రకటించాడు శివాజీ.
కాగా, శోభా శెట్టి – రతిక మధ్య కూడా డిస్కషన్ హీట్ గట్టిగానే నడిచింది. ఈ ఎపిసోడ్లో శోభా శెట్టి అతి కారణంగా రతికకి మార్కులు ఎక్కువ పడ్డాయి.