వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేస్తున్న సినిమా ‘ఆచార్య’. ఇప్పటికే 40% షూటింగ్ ఫినిష్ చేశామని కొరటాల శివ ఇది వరకే తెలిపాడు. చిరంజీవితో పాటు ఇందులో మరో కీలక పాత్ర ఉంది దాని కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీంతో మాట్లాడి ఆచార్య కోసం డేట్స్ తీసుకున్నారు. కానీ ఇంతలో లాక్ డౌన్ ఎక్కడి వక్కడ ఆగిపోయాయి. దాంతో షెడ్యూల్స్ అన్నీ మారిపోయాయి.
ఇప్పటికీ కొరటాల శివ ఫైనల్ చేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అదేమిటంటే ముందుగా రామ్ చరణ్ పాత్ర కోసం హీరోయిన్ ని ఫైనలైజ్ చేయాలి. అందులో భాగంగా కియారా అద్వానీ లేదా రష్మిక మందన్నలను పరిశీలిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ షెడ్యూల్స్ ని ఆలస్యం చేయడానికి వీలు లేదు ఎందుకంటే లాక్ డౌన్ వల్ల ‘ఆర్ఆర్ఆర్’కి కూడా 2 నెలల షూటింగ్ కాలం మిస్ అవుతుంది. కావున లాక్ డౌన్ ఎత్తగానే మొదట కొరటాల శివ చరణ్ పార్టీ ని ఫినిష్ చేయాల్సి ఉంది.
దీని ప్రకారం చూస్తే లాక్ డౌన్ ముగిసే సమయానికి కొరటాల శివ రామ్ చరణ్ కి సమందించిన అన్ని విషయాలు, షూటింగ్ డీటైల్స్ తో పక్కాగా రెడీగా ఉండాలి. లేదంటే రామ్ చరణ్ ఆచార్యని హోల్డ్ లో పెట్టి ఆర్ఆర్ఆర్ కి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ జనవరి 8కి ఉంది. కావున ఆ రిలీజ్ డేట్ డిలే అవ్వకూడదు అంటే ‘ఆచార్య’లో రామ్ చరణ్ పార్ట్ అనుకున్న దానికంటే ముందే ఫినిష్ అవ్వాలి.
290522 465280Howdy! Would you mind if I share your blog with my twitter group? Theres plenty of people that I feel would truly enjoy your content material. Please let me know. Thanks 36535
230571 741574Perfectly written subject material , thanks for selective information . 647428
179765 869941Sweet web site, super pattern , real clean and utilize genial . 701853