టీఎన్ శేషన్.. దేశ రాజకీయాలతో కాస్తో కూస్తో పరిచయం వున్నవారందరికీ ఈ పేరు తెలుసు. నిజానికి, ఆయన చాలామందికి రోల్ మోడల్. ‘టీఎన్ శేషన్ వుండి వుంటేనా.?’ అని ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఓటర్లు, ఆయన్ని గుర్తు చేసుకుంటూనే వున్నారు. నిన్న ఆయన తుది శ్వాస విడిచారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా తాను పనిచేసిన సమయంలో అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా చేశారు శేషన్.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి శేషన్ తీసుకొచ్చిన సంస్కరణలు అప్పట్లో రాజకీయ పార్టీలకే కాదు, మీడియాకీ కంటగింపుగా మారిన మాట వాస్తవం. ఆ స్థాయిలో శేషన్ ‘మోనార్క్’లా వ్యవహరించారు. ఏం చేసినా, అది దేశంలో పారదర్శకంగా ఎన్నికలు జరగడానికేనని శేషన్ చెప్పేవారు. ‘శేషన్కి ముందు, శేషన్కి తర్వాత..’ అని ఇప్పటికీ రాజకీయ పండితులు చెబుతుంటారు ఎన్నికల నిర్వహణ విషయమై.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించాలంటే చాన్నాళ్ళపాటు అభ్యర్థులు, పార్టీలూ భయపడేవంటే.. అదీ టీఎన్ శేషన్ తెచ్చిన సంస్కరణల తీరు. ఇప్పుడంటే, అధికారంలో వున్నవారికి తొత్తులుగా ఎన్నికల అదికారులు నిర్వహింస్తున్నారనే విమర్శలు వస్తున్నాయిగానీ.. శేషన్ పనిచేసిన కాలంలో, ఆ తర్వాత కొన్నాళ్ళపాటు.. ఆ పరిస్థితి లేదు.
అందుకే, దేశమంతా ఆయన్ని కీర్తిస్తోంది. ‘రెస్ట్ ఇన్ పీస్ శేషన్’ అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ‘ఈవీఎంలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు’ అనే విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి. అధికార పార్టీ కనుసన్నల్లో ఓట్ల తొలగింపు జరుగుతోందన్న విమర్శల సంగతి సరే సరి. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజానీకం మరో టీఎన్ శేషన్ని ఆశిస్తోంది.
515278 521124I like you blog (dsol, je suis francais, je parle mal anglais) 693070