ప్రజారోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని ప్రతి పాలకుడూ తెలుసుకోవాలి. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకి హేట్సాఫ్ చెప్పాల్సిందే. కరోనా వైరస్ విషయమై మీడియా ముందుకొచ్చి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిన సూచన, ఆంధ్రప్రదేశ్ ప్రజలూ మెచ్చేలా వుంది. మీడియాకి వార్నింగ్ ఇచ్చినా, ఇతరత్రా అంశాలపై కాస్తంత ఘాటుగా మాట్లాడినా, కేసీఆర్ మాటల్లో స్పష్టత కన్పిస్తుంటుంది. ‘ప్రజలంతా నా వాళ్ళు’ అనే భావన ఆయన మాటల్లో కన్పిస్తుంటుంది ఇలాంటి సందర్భాల్లో.
భయపడొద్దంటూనే, ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్త చర్యల్ని ఆయన వివరించిన తీరు అత్యద్భుతం. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో చాలాసార్లు ఆయన మీడియా ముందుకొచ్చారు. క్యాబినెట్ సమావేశాల సందర్భంగా కావొచ్చు, ఇతరత్రా కీలక సమయాల్లో కావొచ్చు.. కేసీఆర్, మీడియా ముందుకొస్తే.. సుదీర్ఘంగా మాట్లాడతారు. కేసీఆర్ మాట్లాడేంతసేపూ, చానల్ మార్చేందుకు ఎవరూ ఇష్టపడరంటే అది అతిశయోక్తి కాదేమో.. కేసీఆర్ అంటే నచ్చనివాళ్ళు సైతం, ఆయన మాటల గారడీకి స్పెల్ బౌండ్ అయిపోవాల్సిందే.
కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరిస్థితి వేరు. క్యాబినెట్ నిర్ణయాల్ని మంత్రులు వెల్లడించేస్తుంటారు. కీలక విషయాలపైన కూడా మీడియా ముందుకొచ్చేందుకు వైఎస్ జగన్ సాహసించరు. ఆ మాటకొస్తే, చంద్రబాబు కూడా అంతే. జగన్తో పోల్చితే చంద్రబాబు కాస్త బెటర్ ఈ విషయంలో. కానీ, చంద్రబాబు ప్రసంగాల్ని తట్టుకోవడం కష్టం.
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం, స్థానిక ఎన్నికలకు వెళ్ళడమే వ్యూహాత్మక తప్పిదం. పైగా, పదో తరగతి పరీక్షల్ని వాయిదా వేసి మరీ ఎన్నికలకు వెళ్ళడం.. ఇంకా ఆక్షేపణీయం. ‘తెలంగాణ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలూ కేసీఆర్ నాయకత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు..’ అని అడపా దడపా టీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు. ఇప్పుడు ఆ వాదన ఇంకాస్త నిజం అనిపించేలా పరిస్థితులు మారుతున్నాయి.
522900 722224if the buffalo in my head could speak german i would not know a god damm thing. What i do know is that the language of art is out of this world. 895699