ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి, విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించి భారీ ప్యాకేజీని ప్రకటించారు. నిజానికి, ఇంతవరకూ ఇంత పెద్ద ప్యాకేజీని ఏ ప్రభుత్వమూ ప్రకటించలేదు. అయితే, ఇక్కడే చాలా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలకు ఎల్జీ పాలిమర్స్ సంస్థతో పరోక్ష సంబంధాలు వుండడంతోనే.. ‘పాప పరిహారార్ధం’ ఈ ప్యాకేజీ ప్రకటించారంటూ బాధిత కుటుంబాలు వాపోతుండడం గమనార్హం.
‘మా కుటుంబ సభ్యుల ప్రాణాలకు మీరు వెల కడ్తారా.? మేమంతా చందాలేసుకుని కోటి రూపాయలు పోగేస్తాం.. మీలో ఎవడన్నా ప్రాణాలు ఇస్తాడా.?’ అని ఓ బాధిత మహిళ, బూతులు తిడుతూ, సాక్షాత్తూ మంత్రుల్ని ప్రశ్నించడం ఘటన తాలూకు తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి.
ఎల్జీ పాలిమర్స్ సంస్థను కాపాడేందుకు ‘అత్యున్నత స్థాయిలో’ ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదన బాధిత ప్రజానీకం నుంచి వ్యక్తమవుతోంది. ‘మేం మా వారిని కోల్పోయాం.. మా కుటుంబ సభ్యుల్లో ఎవరు చికిత్స పొందుతున్నారో, ఎవరు ప్రాణాలు కోల్పోయారో తెలియడంలేదు. మా కుటుంబ సభ్యుల్ని పూర్తిగా మేమింకా కలుసుకోలేకపోయాం..’ అని కొందరు బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు.
నీరు, గాలి.. అన్నీ కలుషితమైపోయాయని నెత్తీనోరూ బాదుకుంటున్నారు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లోని ప్రజానీకం. ‘అధికార పార్టీ నేతలు మమ్మల్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.. మాట వినకపోతే బెదిరిస్తున్నారు.. సమస్య తీవ్రతను తక్కువగా చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి..’ అని ఆందోళన బాట పట్టారు ప్రజలు. అయితే, కొందరు కుట్ర పూరితంగానే ఈ ఆందోళనల్ని సృష్టిస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు బుకాయిస్తున్నారు.
392668 654722This internet site can be a walk-by way of for all of the data you necessary about this and didnt know who to ask. Glimpse here, and also youll definitely uncover it. 891297