దేశంలోనే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళేందుకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి కరోనా వైరస్ కారణంగా. ఇప్పుడిప్పుడే వలస కూలీల్ని తమ సొంత ప్రాంతాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.
మరోపక్క, విదేశాల నుంచి కూడా ‘చుట్టాల రాక’ మొదలైంది. కేరళకు ఇప్పటికే తొలి దఫాలో కొందరు వచ్చారు. వివిధ దేశాల నుంచి వస్తోన్న వీరంతా, దేశం కాని దేశంలో కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడ్డవారే. వాళ్ళంతా మనవాళ్ళే. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. కరోనా వైరస్ దెబ్బకి ఇరుగిల్లు.. పొరుగిల్లు వైపు చూసేందుకూ ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది.
అయితే, ఇతర దేశాల నుంచి వస్తోన్న మనవారితో పెద్దగా ఇబ్బందులు వుండవని కేంద్ర రాష్ట్రాలు భరోసా ఇస్తున్నాయి. స్వదేశానికి రాగానే, వారికి స్క్రీనింగ్ వుంటుంది. అనుమానితులకి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. క్వారంటైన్లో కూడా వుంచుతారు. ఇందు కోసం ‘పెయిడ్ క్వారంటైన్’ని కూడా కేంద్ర రాష్ట్రాలు పరిశీలిస్తుండడం గమనార్హం.
అటు విదేశాల నుంచి వస్తున్నవారు.. ఇటు రాష్ట్రాల మధ్య అట్నుంచి ఇటు.. ఇట్నుంచి అటు వెళుతున్నవారి కారణంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ముందు ముందు మరింత పెరగనున్నాయన్నది నిర్వివాదాంశం. అయితే, అలా వెళుతున్నవారందరికీ క్వారంటైన్ తప్పనిసరి గనుక.. కేసులు పెరిగినా, ‘వ్యాప్తి’ మరీ ఎక్కువగా వుండకపోవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి.
ఇదిలా వుంటే, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 వేల మార్క్ దాటేసింది. 50 వేల నుంచి 60 వేలకు చాలా వేగంగా కేసులు పెరిగిన దరిమిలా, ఈ కేసుల సంఖ్య లక్షకు చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. గత కొద్ది రోజులుగా సగటున దేశంలో 3 వేలకు పైగానే ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతుండడం గమనార్హం. మరణాల సంఖ్య కూడా గడచిన కొద్ది రోజుల్లో బాగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండడం గమనార్హం.
340371 413838Hi. Thank you for making this website . I m working on betting online niche and have discovered this internet site employing search on bing . Will likely be sure to look a lot more of your content material . Gracias , see ya. :S 654530