నీ నెత్తి మీద వెంట్రుకలు ఒరిజినల్ కాదు.. అలాగే, నీ మూతి మీద వెంట్రుకలు కూడా నిజమైనవి కావా.? అని ఓ రాజకీయ పార్టీకి చెందిన జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రశ్నించడమేంటి.? పైగా, ఆయన రాజ్యసభ సభ్యుడు. రాష్ట్ర ప్రభుత్వానికీ, కేంద్ర ప్రభుత్వానికీ అనుసంధానకర్త.!
పోలవరం ప్రాజెక్టు గురించో, ప్రత్యేక హోదా గురించో మాట్లాడితే బావుంటుందిగానీ, సొంత పార్టీకి చెందిన రెబల్ ఎంపీ (లోక్సభ) వెంట్రుకల గురించి, సదరు రాజ్యసభ సభ్యుడికి ఎందుకు.? లోక్ సభ సభ్యుడంటే జనం వేసే ఓట్లతో గెలుస్తారు.. రాజ్యసభ సభ్యుడంటే, అది నామినేటెడ్ పదవి. ఎవరు ఎవర్ని వెక్కిరిస్తున్నారిక్కడ.? పెద్దల సభ స్థాయిని దిగజార్చడానికే, ఆ రాజ్యసభ సభ్యుడు ప్రయత్నిస్తున్నట్టున్నారు.
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడు విజయసాయిరెడ్డి, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా.
హలో రసిక వానరా! అవును నాకు ఉన్నది విగ్గు..ఎన్ని తన్నులు తిన్నా నీకు లేనిది సిగ్గు. కొత్తగా రాజీనామా అంటున్నావు? నువ్వు, నీ గ్యాంగ్ లీడర్ అనర్హత/సస్పెన్షన్ పై చేతులు ఎత్తేసారా? నేను ఏపీ కి వస్తే ముఖ్యమంత్రి కి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వుద్ది అనేగా నా పై కేసులు పెట్టిస్తున్నారు. https://t.co/KyxIF96tUN
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 12, 2022
ఆయనే, సొంత పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ‘వెంట్రుకల’ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రమన్నా, రాష్ట్ర ప్రజలన్నా రాజకీయ నాయకులకు ఎంత చులకనైపోయిందో, అధికార పార్టీ, ప్రజాస్వామ్యాన్ని ఎంత పరిహసిస్తోందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్న చందాన, విజయసాయిరెడ్డి విమర్శలకి, రఘురామకృష్ణరాజు నుంచి కౌంటర్ ఎటాక్ అంతకన్నా దారుణంగా వచ్చింది. ‘కండోమ్ రెడ్డీ..’ అంటూ మొదలెట్టారు రఘురామకృష్ణరాజు. వెంట్రుకలు నిజమైనవో కావో తెలుసుకుందువుగాని.. తొందరెందుకు.? మనం కలుసుకుంటాం కదా.. అప్పుడు పీకడానికి ప్రయత్నించి చూడు.. అంటూ రఘురామ సెటైరేశారు.
రఘురామకృష్ణరాజు 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచే గెలిచారు. ఆ తర్వాత, సొంత పార్టీలో ఆయనకు ‘పొగ’ ఎదురయ్యింది. అలాగని, ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపేంత సీన్ వైసీపీకి వుందా.? అంటే అదీ లేదు. వైసీపీ అధిష్టానం, తన అసమర్థతని కప్పి పుచ్చుకునేందుకు రఘురామపై, మిగిలిన పార్టీ నేతలతో రాజకీయ దాడి చేయిస్తూ వస్తోంది.
నిజానికి, ఇదో పెద్ద రాజకీయ నాటకం. ఈ నాటకంలో భాగంగానే, ఇదిగో.. సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ నేతల బూతు పురాణం. సిగ్గనేది లేదా.? అంటూ నెటిజనం అధికార పార్టీపై మండిపడుతున్నారు. ‘మీరు పెద్దలకు సభకు పంపిన మీ ఎంపీ, మీరు లోక్సభకు పంపిన మీ ఎంపీ ఎంతలా దిగజారిపోయారో మీకు కనిపిస్తోందా.? మీరే ఆ ఇద్దరితోనూ ఈ బూతు నాటకం ఆడిస్తున్నారా.?’ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అజ్ఞాతవాసం తరువాత పాండవులకి, అరణ్యవాసం తరువాత శ్రీ రాముడికి జరిగింది పట్టాభిషేకం. చచ్చింది కౌరవులు, దానవులు. తెలుసుకో రా కండోమ్ రెడ్డి!! https://t.co/BrRMt9nafs
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 12, 2022
ఎవడు ఒరిజినల్ రాజో ఎవడు డూప్లికేట్ రెడ్డో ప్రజలకి ‘ఎరుక’లే రా! మనం కలిసినప్పుడు నా వెంట్రులన్నీ చూపిస్తా..నువ్వే పీకి చూస్కో! https://t.co/Tq2VWrvfwM
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 12, 2022