మహేష్ బాబు 25వ సినిమా మహర్షి కి దర్శకత్వం వహించిన దర్శకుడు వంశీ పైడిపల్లి మరోసారి మహేష్ చాన్స్ ను దక్కించుకున్నాడు. మహేష్ 27వ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చేస్తున్నాడు. ఈ సమయంలో వంశీ పైడిపల్లి మహేష్ బాబు నిర్మాణ సంస్థ కోసం పని చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
తన నిర్మాణ సంస్థలో మహేష్ బాబు వెబ్ సిరీస్ ఇంకా సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నాడు. అయితే స్క్రిప్ట్ విషయాలు చూసుకునేందుకు మహేష్ కు సమయం ఉండటం లేదు. అందుకే ఆ బాధ్యతను వంశీకి మహేష్ అప్పగించాడట. ప్రస్తుతం కొత్తవారు తీసుకు వస్తున్న కథలను ఐడియాలను వంశీ పరిశీలిస్తున్నారు.
మహేష్ బాబు నుండి రాబోతున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను పూర్తిగా వంశీ పర్యవేక్షించే అవకాశం ఉంది. అందుకు గాను మహేష్ బాబు నుండి వంశీ భారీ పారితోషికాన్ని కూడా అందుకోబోతున్నాట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు కమిట్ అయ్యి ఉన్న సినిమాలు పూర్తి అయిన తర్వాత వంశీకి కూడా చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈలోపు ఇలా మహేష్ తో వంశీ ట్రావెల్ చేయబోతున్నాడు.
591613 211969Someone essentially assist to make severely posts I may state. That is the very 1st time I frequented your website page and so far? I surprised with the analysis you made to create this certain submit incredible. Magnificent task! 452661
983644 273417Yeah bookmaking this wasnt a bad decision fantastic post! . 569642