కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్లాక్ 2.0 లో భాగంగా అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతులు అక్కర్లేదు అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో హైదరాబాద్లో మళ్లీ లాక్డౌన్ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీకి భారీ ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడకు వస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. టోల్ గేట్స్ వద్ద కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక బోర్డర్ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మద్య ప్రయాణంకు అనుమతులు ఇచ్చినా కూడా ఏపీ ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికి అనుమతులు తప్పనిసరి చేసింది. దాంతో బోర్డర్ వరకు వెళ్లిన వారి పరిస్థితి అటు ఇటు కాకుండా ఉంటుంది. ఏపీ డీజీపీ ఆదేశాల మేరకు బోర్డర్ వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. కొందరిని స్క్రీనింగ్ చేసి పంపిస్తుండగా మరికొందరిని మాత్రం అనుమతించడం లేదు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ డీజీపీ మాత్రం ఏపీకి ఇష్టానుసారంగా వస్తామంటే ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సిందే అంటున్నారు.
899035 49250Thank you for your extremely great details and feedback from you. san jose car dealers 384525
308032 371786Absolutely composed content material , thankyou for information . 559369
728868 118563Wow, superb blog layout! How long have you been blogging for? you make blogging look easy. The overall appear of your website is magnificent, as well as the content material! xrumer 932862