ప్రముఖ టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి పద్మావతి హైదరాబాద్ లో కన్నుమూశారు. కొంతకాలం క్రితం క్యాన్సర్ బారిన పడిన ఆమె బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్కు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణ చూసుకునేవారు.
భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఇతర కుటుంబసభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న చిరంజీవి, ప్రకాశ్రాజ్, బ్రహ్మాజీ, ఏడిద రాజా, జీవిత రాజశేఖర్ ఆస్పత్రికి చేరుకుని ఉత్తేజ్ని పరామర్శించారు. ఈ సమయంలో చిరంజీవిని పట్టుకుని ఉత్తేజ్, ఆయన కుమార్తె చేతన బోరున విలపించారు. వారిని ఓదార్చడం అక్కడివారి వల్ల కాలేదు. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఉత్తేజ్, చేతన వారి కుటుంబసభ్యులను ఓదార్చారు.
438450 118108I like this post a great deal. I will definitely be back. Hope that I will be able to read much more insightful posts then. Will probably be sharing your knowledge with all of my associates! 188145
90953 342828I was suggested this web site by my cousin. Im not sure whether this post is written by him as no 1 else know such detailed about my trouble. You are amazing! Thanks! xrumer 454434