Switch to English

అన్‌ లాక్‌ 2: పూర్తిగా నిరాశపర్చిన మోడీ ప్రసంగం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

‘వర్షాకాలం.. అనేక అనారోగ్య సమస్యలకు కారణమయ్యే సీజన్‌.. కరోనా వైరస్‌ పట్ల ఇంకాస్త ఎక్కువ అప్రమత్తంగా వుండాలి..’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల్ని ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించిన సందర్భంలో వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌తో లక్షలాదిమంది ప్రజల్ని కరోనా వైరస్‌ బారిన పడకుండా కాపాడుకున్నామనీ.. కేసుల సంఖ్య మరీ ఎక్కువగా పెరగకుండా చూసుకోగలిగామనీ.. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.

‘మాస్క్‌లు ప్రతి ఒక్కరూ ధరించాల్సిందే.. మాస్క్‌ ధరించకపోతే దేశ ప్రధానికి సైతం జరీమానా పడే స్థాయిలో ఇక్కడా పరిస్థితులు వుండాలి’ అని ప్రధాని అభిప్రాయపడ్డారు. నిజమే, మాస్క్‌ ధరించకపోతే జరీమానాలు విధిస్తున్నారు.. కానీ, అవి సామాన్యులకే. ముఖ్యమంత్రులు మాస్క్‌ పెట్టుకోకుండా తిరిగేస్తున్నారు.. ప్రజా ప్రతినిథులు తమ వెంట అనుచరుల్ని వేసుకుని నానా హంగామా చేస్తున్నారు. కోర్టు మొట్టికాయలేసినా రాజకీయ నాయకుల్లో మార్పు రావడంలేదు. మరి, అలాంటివారిపై ఎలాంటి చర్యలు కేంద్రం తీసుకుంటుంది.? అన్న ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నమవుతోంది.

‘అసలే కరోనా దెబ్బకి ఆర్థికంగా చితికిపోయాం. పొరపాటున మాస్క్‌ ధరించకపోతే, ఆ కారణంగా పెద్దమొత్తంలో జరీమానా చెల్లించాల్సి వస్తే పరిస్థితి ఏంటి.?’ అన్న ఆవేదన కూడా సాధారణ ప్రజానీకం నుంచి వ్యక్తమవుతోంది. ఓ పక్క, కరోనా పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ప్రధాని స్వయంగా చెబుతున్నారు. మరి, లాక్‌డౌన్‌ నుంచి ఈ సడలింపులేంటి.? రేపట్నుంచి అన్‌ లాక్‌ 2 ప్రకటించడమేంటి.? అన్నిటికీ మించి, దేశంలో మద్యం షాపుల్ని తెరవాల్సిన అవసరమేంటి.? అవును, దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం మొదలయ్యింది మద్యం దుకాణాల్ని తెరవడంతోనే. ఆ తర్వాతే రోడ్డు ప్రమాదాలూ పెరిగాయి.. ఇతరత్రా సమస్యలూ పెరిగాయి.

నిజానికి, ప్రధాని ప్రసంగంపై దేశ ప్రజానీకం చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ, నెలవారీ ఇస్తోన్న ‘ఉచిత రేషన్‌’ నవంబర్‌ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించడం మినహా.. దేశ ప్రజల్ని ఉద్ధరించే ఒక్క కొత్త కార్యక్రమాన్నీ ప్రధాని ప్రకటించలేకపోయారు. కరోనా కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నదీ ప్రజలకు వివరించడంలో ప్రధాని విఫలమయ్యారు. నేటితో అన్‌ లాక్‌ 1 ముగుస్తుంది గనుక, రేపట్నుంచి అన్‌ లాక్‌ 2 మొదలవుతుందని చెప్పడానికే ప్రధాని ‘ప్రసంగం’ డిజైన్‌ చేసినట్లుంది పరిస్థితి. చైనా – భారత్‌ మధ్య సరిహద్దు వివాదం, చైనా యాప్స్‌పై వేటు.. వంటి అంశాలపైనా ప్రధాని మాట్లాడకపోవడం చాలామందిని విస్మయానికి గురిచేసింది. ఒక్కటి మాత్రం నిజం.. కరోనా వైరస్‌ ఓ పక్క కబళించేస్తోంటే.. కేంద్రం మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...