Switch to English

పోలవరం రగడ: జగన్‌పై ఉండవల్లి సెన్సేషనల్‌ కామెంట్స్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

పోలవరం ప్రాజెక్టు ఎత్తు ముందు అనుకున్న స్థాయిలోనే వుండబోతోందా.? నీటి నిల్వ సామర్థ్యం ఎంత.? పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఆలోచన ఏంటి.? రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటోంది.? కేంద్రం చెబుతున్న మాటల్లో నిజమెంత.? రాష్ట్రం చెబుతున్న మాటల్లో విశ్వసనీయత ఎంత.? పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకమన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, జగన్‌తో దోస్తీ కోసం.. రాజీ పడ్డారా.? లేదంటే, కేసీఆర్‌కి భయపడి, ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా పోలవరం ప్రాజెక్టుని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఎత్తు తగ్గించి నిర్మిస్తోందా.? ఇలా చాలా ప్రశ్నలు. ఏ ప్రశ్నకీ సరైన సమాధానం దొరకడంలేదు.

‘ప్రాజెక్టు పూర్తయ్యాక.. వచ్చి టేపుతో కొలుచుకోండి..’ అంటూ వెటకారపు విమర్శలు చేస్తున్నారు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. ప్రాజెక్టుల ఎత్తుల్ని టేపులతో ప్రజలు కొలుచుకునే దుస్థితి నిజంగానే వస్తుందా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఏమో, ఆ రోజు కూడా వచ్చేస్తుందేమో. ఇక, ఈ వ్యవహారాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో గోదావరి నదిపై కేసీఆర్‌ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తోంటే, వాటి ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌ వెళ్లడం చారిత్రక తప్పిదమని ఉండవల్లి ఆరోపించారు. ‘ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ముఖ్య నేతలకు ఆస్తులన్నీ తెలంగాణలోనే వున్నాయి. అదే అసలు సమస్య. కేసీఆర్‌కి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు వెళ్ళిల్సి వస్తుంది..’ అంటూ గతంలో అధికారంలో వున్న టీడీపీపైనా, ప్రస్తుతం అధికారంలో వున్న వైసీపీపైనా మండిపడ్డారు ఉండవల్లి.

నిజానికి, ఈ వాదనలో కొంత నిజం లేకపోలేదు. లేకపోతే, పోలవరం ప్రాజెక్టు ఎత్తుని తగ్గించేందుకు వైఎస్‌ జగన్‌ అంగీకరించారంటూ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ ఎలా చెప్పగలుగుతారు.? గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టేసింది. కానీ, దానికి ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం పెట్టలేకపోయింది సమర్థవంతంగా. కానీ, ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి అయిన పోలవరం విషయంలో తెలంగాణ అభ్యంతరాలు పెడుతూనే వుంది.

ఇవన్నీ ఓ ఎత్తు.. ప్రాజెక్టు ఎత్తు పూర్తిస్థాయిలో వుండాలంటే, నీటి నిల్వ పూర్తిగా వుండాలంటే.. పునరావాస ప్యాకేజీ విషయమై కేంద్రం, సానుకూలంగా స్పందించాలి. 55 వేల కోట్ల రూపాయల అంచనాల్ని కేంద్రం ఆమోదించాలి.. అందుకు తగ్గ నిధులు అందించాలి. ఆమోదం వంటివి ప్రాథమికంగా జరిగిపోయినా, కొర్రీలు షురూ అయ్యాయి. ఆ కారణంగానే ఎత్తు తగ్గించి, నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేయాలని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చూస్తోందన్నది ఓ ఆరోపణ.

ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన విషయం. ఉండవల్లి విమర్శించారని కాదుగానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ‘హక్కు’ అయిన పోలవరం విషయంలో అస్సలు రాజీపడకూడదు. దురదృష్టవశాత్తూ గతంలో టీడీపీ రాజీ పడింది.. ఇప్పుడు వైసీపీ రాజీపడుతోంది.. రాష్ట్రం భవిష్యత్తు కేంద్రం వద్ద తాకట్టుపెట్టబడుతోంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...