పోలవరం ప్రాజెక్టు ఎత్తు ముందు అనుకున్న స్థాయిలోనే వుండబోతోందా.? నీటి నిల్వ సామర్థ్యం ఎంత.? పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఆలోచన ఏంటి.? రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటోంది.? కేంద్రం చెబుతున్న మాటల్లో నిజమెంత.? రాష్ట్రం చెబుతున్న మాటల్లో విశ్వసనీయత ఎంత.? పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకమన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్తో దోస్తీ కోసం.. రాజీ పడ్డారా.? లేదంటే, కేసీఆర్కి భయపడి, ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా పోలవరం ప్రాజెక్టుని వైఎస్ జగన్ సర్కార్ ఎత్తు తగ్గించి నిర్మిస్తోందా.? ఇలా చాలా ప్రశ్నలు. ఏ ప్రశ్నకీ సరైన సమాధానం దొరకడంలేదు.
‘ప్రాజెక్టు పూర్తయ్యాక.. వచ్చి టేపుతో కొలుచుకోండి..’ అంటూ వెటకారపు విమర్శలు చేస్తున్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రాజెక్టుల ఎత్తుల్ని టేపులతో ప్రజలు కొలుచుకునే దుస్థితి నిజంగానే వస్తుందా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏమో, ఆ రోజు కూడా వచ్చేస్తుందేమో. ఇక, ఈ వ్యవహారాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో గోదావరి నదిపై కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తోంటే, వాటి ప్రారంభోత్సవానికి వైఎస్ జగన్ వెళ్లడం చారిత్రక తప్పిదమని ఉండవల్లి ఆరోపించారు. ‘ఆంధ్రప్రదేశ్కి చెందిన ముఖ్య నేతలకు ఆస్తులన్నీ తెలంగాణలోనే వున్నాయి. అదే అసలు సమస్య. కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు వెళ్ళిల్సి వస్తుంది..’ అంటూ గతంలో అధికారంలో వున్న టీడీపీపైనా, ప్రస్తుతం అధికారంలో వున్న వైసీపీపైనా మండిపడ్డారు ఉండవల్లి.
నిజానికి, ఈ వాదనలో కొంత నిజం లేకపోలేదు. లేకపోతే, పోలవరం ప్రాజెక్టు ఎత్తుని తగ్గించేందుకు వైఎస్ జగన్ అంగీకరించారంటూ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఎలా చెప్పగలుగుతారు.? గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టేసింది. కానీ, దానికి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టలేకపోయింది సమర్థవంతంగా. కానీ, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం విషయంలో తెలంగాణ అభ్యంతరాలు పెడుతూనే వుంది.
ఇవన్నీ ఓ ఎత్తు.. ప్రాజెక్టు ఎత్తు పూర్తిస్థాయిలో వుండాలంటే, నీటి నిల్వ పూర్తిగా వుండాలంటే.. పునరావాస ప్యాకేజీ విషయమై కేంద్రం, సానుకూలంగా స్పందించాలి. 55 వేల కోట్ల రూపాయల అంచనాల్ని కేంద్రం ఆమోదించాలి.. అందుకు తగ్గ నిధులు అందించాలి. ఆమోదం వంటివి ప్రాథమికంగా జరిగిపోయినా, కొర్రీలు షురూ అయ్యాయి. ఆ కారణంగానే ఎత్తు తగ్గించి, నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేయాలని వైఎస్ జగన్ సర్కార్ చూస్తోందన్నది ఓ ఆరోపణ.
ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన విషయం. ఉండవల్లి విమర్శించారని కాదుగానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ‘హక్కు’ అయిన పోలవరం విషయంలో అస్సలు రాజీపడకూడదు. దురదృష్టవశాత్తూ గతంలో టీడీపీ రాజీ పడింది.. ఇప్పుడు వైసీపీ రాజీపడుతోంది.. రాష్ట్రం భవిష్యత్తు కేంద్రం వద్ద తాకట్టుపెట్టబడుతోంది.
151434 46530An very intriguing examine, I might not agree completely, but you do make some very legitimate factors. 858450
96700 516716This is 1 really fascinating post. I like the way you write and I will bookmark your weblog to my favorites. 802723
165217 837238Thanks for blogging and i enjoy the weblog posting so no public comments.,,,,,,,,,,, 546010
789326 450371This really is a excellent topic to talk about. Sometimes I fav stuff like this on Redit. I dont think this would be the top to submit though. Ill take a look about your site though and submit something else. 601598
937322 462107I adore your wp design, wherever did you download it via? 104856
769932 125023hi was just seeing should you minded a comment. i like your internet site and the thme you picked is awesome. I will probably be back. 559564