Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఏడాదిన్నరలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

పోలవరం ప్రాజెక్ట్‌.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఎప్పుడో బ్రిటిష్‌ హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఆలోచనలు ముందడుగు వేశాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞం.. అంటూ పోలవరం ప్రాజెక్టుకి పెద్దపీట వేసిన మాట వాస్తవం. అయితే, కాలువలు మాత్రమే తవ్వి.. ఆ కాలువల పేరు చెప్పి కోట్లు మింగేశారంటూ అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కుప్పలు తెప్పలుగా ఆరోపణలు విపక్షాల నుంచి దూసుకొచ్చాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక, పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా లభించింది. కేంద్రం నిధులు ఇస్తే తప్ప, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదు. 2018 చివరి నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తిచేస్తామని అప్పట్లో చంద్రబాబు ఘనంగా చెప్పుకున్నారు. కానీ, అది జరగలేదు. ఇప్పుడు మనం 2020లో వున్నాం. 2020లో ఇప్పటికే ఆరు నెలలు పూర్తయిపోయింది. 2021 చివరి నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెబుతున్నారు.

వైఎస్‌ జగన్‌ చెప్పినట్లే, 2021 చివరి నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయితే అంతకన్నా కావాల్సిందేముంది.? కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే కేంద్రం నిధులు ఇవ్వాల్సి వుంది. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ముంపు ప్రాంతాల పునరావాసం. దీనికోసం వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు చేయాలని చంద్రబాబు హయాంలోనే లెక్కలు తేలాయి. కానీ, ఆ లెక్కల విషయంలో కేంద్రం – రాష్ట్రం మధ్య గ్యాప్‌ ఇంకా అలాగే కొనసాగుతోంది.

సుమారుగా 60 వేల కోట్ల రూపాయల సవరించిన అంచనాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదు. రాష్ట్రం, అన్ని వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసే పరిస్థితీ లేదు. మరెలా పోలవరం ప్రాజెక్టు ఇంకో ఏడాదిన్నరలో పూర్తవుతుంది.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

చంద్రబాబు, తన హయాంలోనే ప్రాజెక్టు పనులు దాదాపు 70 శాతం పూర్తయిపోయాయని చెప్పుకున్నారు. వైసీపీ హయాంలోనూ అవే లెక్కలు కన్పిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, పోలవరం ప్రాజెక్టు చుట్టూ చాలా అనుమానాలున్నాయి. ఇన్ని అనుమానాల నడుమ, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదెప్పుడు.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...