ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగి పెద్దన్న పాత్ర పోషించాలని తహతహలాడుతున్న చైనా కొత్త ఎత్తుగడకు దిగిందని, ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ సృష్టించి ప్రపంచాన్ని పెను విపత్తులోకి నెట్టేసిన డ్రాగన్.. తాజాగా అదే తరహాలో బయో వార్ కు దిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి టార్గెట్ గా అమెరికాను ఎంచుకున్న ఈ కమ్యూనిస్టు దేశం.. అగ్రరాజ్యానికి సందేహాస్పద విత్తన ప్యాకెట్లు పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్డర్ చేయకపోయినా సరే, చైనా పోస్టు పేరుతో ఉన్న పలు పార్శిళ్లు ఇటీవల అమెరికాలోని పలు రాష్ట్రాల ప్రజలకు అందాయి.
దీంతో రంగంలోకి దిగిన అమెరికా అధికారులు.. వాటిని ఎవరూ ముట్టుకోవద్దని, ఎక్కడ విత్తవద్దని, ఏం చేయాలో తామే చెబుతామని స్పష్టంచేశారు. విషపూరితమైన విత్తనాల ద్వారా తన శత్రుదేశాలను దెబ్బతీయాలన్నదే డ్రాగన్ లక్ష్యమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ముప్పు మనక్కూడా పొంచి ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేసింది. అమెరికా, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్, జపాన్ సహా పలు యూరప్ దేశాలకు ఇటీవల కాలంలో సందేహాస్పద విత్తన పార్శిళ్లు వచ్చాయని.. ప్రపంచవ్యాప్తంగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వేలాది పార్శిళ్లు వచ్చినట్టు వెల్లడైందని.. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
ఆ సందేహాస్పద విత్తనాలు మన దేశ జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉన్నందున అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని సూచించింది. అన్ని రాష్ట్రాల వ్యవసాయ యూనివర్సిటీలు, విత్తన సంస్థలు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. కరోనాతో ఇప్పటికే కుదేలైన ప్రపంచాన్ని నాశనం చేయాలన్నదే డ్రాగన్ లక్ష్యంగా కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పార్శిళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో దర్యాప్తు చేసి నిజాల్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజం మీద ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
277205 712730Vi ringrazio, considero che quello che ho letto sia ottimo 695087