యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. సాయి తేజ్ తమ్ముడిగా వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీ జనాల దృష్టిని ఆకర్షించగలిగాడు. ఇక ఉప్పెన సినిమా షూటింగ్ ముగించుకుని రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సుకుమార్ సహనిర్మాణంలో తన శిష్యుడు బుచ్చి బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక మొదటి సినిమా విడుదల కాకుండానే వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.
మరోసారి కొత్త దర్శకుడితోనే వైష్ణవ్ తేజ్ పనిచేయనున్నాడు. అయితే తన రెండో సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించనుంది. సహజంగా మెగా హీరోల విషయంలో గీతా ఆర్ట్స్ ఒక పద్దతి ఫాలో అవుతోంది. రామ్ చరణ్, సాయి తేజ్, అల్లు శిరీష్ కెరీర్లలో రెండో సినిమాలను గీతా ఆర్ట్స్ నిర్మించింది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ విషయంలో కూడా అదే జరుగుతోంది. కొత్త దర్శకుడు చెప్పిన కథకు అల్లు అరవింద్ ఫిదా అయిపోయి వెంటనే వైష్ణవ్ కోసం లాక్ చేసాడట. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన విషయాలు మరి కొన్ని నెలల్లో బయటకు వస్తాయి.
మరోవైపు యూవీ క్రియేషన్స్ కూడా వైష్ణవ్ తేజ్ తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉంది.
637035 321696Thanks for every other excellent article. 767574
621716 372869I took a break to view your write-up. I found it extremely relaxing 267754