ప్రజల గుండెలో ఉన్న వ్యక్తే ఎన్నికల్లో గెలుస్తాడు అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల గుండెల్లో గతంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు లేడని.. ఆయన చేస్తున్న పనుల వల్ల ప్రజలకు ఆయనంటే కోపం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో కేసీఆర్ ను అసహ్యించుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. ఆ సంఖ్య ఎన్నికల నాటికి భారీగా పెరిగి ఎన్నికల్లో ఆయనకు సరైన గుణపాఠం చెప్పడం ఖాయం అన్నాడు. ఇంకా ఈటెల మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నాడు. టీఆర్ఎస్ కావాలని కాంగ్రెస్ పార్టీకి జనాల్లో పబ్లిసిటీ కల్పిస్తున్నట్లుగా అనిపిస్తుందన్నాడు.
ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అవి టీఆర్ఎస్ కు వేసినట్లే అవుతుందని.. టీఆర్ఎస్ కు సరైన పోటీ.. గట్టి పోటీ ఇచ్చేది బీజేపీ మాత్రమే అని.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నం అయ్యిందంటూ ఆయన తెలియజేశారు. రైతు బంధు పథకంను కేవలం పేదలకు మాత్రమే ఇవ్వాలని తాను మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాను అని.. పేద రైతులకు మరింతగా పెంచి రైతు బంధు ఇవ్వడం వల్ల వారు ప్రయోజనం పొందుతారని.. కౌలు రౌతులకు మద్దతుగా నిలవాలని కూడా ఆయన డిమాండ్ చేశాడు.
500759 436828Dead written articles , Really enjoyed reading . 768065
396627 908321As soon as I detected this internet site I went on reddit to share some of the enjoy with them. 216926
21457 302708An fascinating dialogue is value comment. I feel that its best to write extra on this matter, it might not be a taboo topic however typically folks are not enough to speak on such topics. Towards the next. Cheers 684100