సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ మధ్య ‘యుద్ధం’ తారాస్థాయికి చేరింది. ‘వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం’ అనే హ్యాష్ ట్యాగ్తో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కుప్పలు తెప్పలుగా పోస్టింగ్స్ చేస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో ఈ హ్యాష్ట్యాగ్తో పొటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాలు వరదల కారణంగా విలవిల్లాడటం వైఎస్ జగన్ సర్కార్కి పెద్ద తలనొప్పిగా మారింది.
నిజానికి, ఇలాంటి సందర్భాల్లోనే ప్రభుత్వం తమ పనితీరుతో బాధితుల మనసుల్ని గెల్చుకోవాల్సి వుంటుంది. అయితే, అందివచ్చిన అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేజేతులా వదిలేసుకున్నారు. వరదలపై సమీక్షించాల్సిన ముఖ్యమంత్రి విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. మంత్రులేమో, వరదల పేరుతో ప్రతిపక్షంపై బురద రాజకీయం షురూ చేశారు. కృష్ణా నదికి వచ్చిన వరదల్నే తీసుకుంటే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కాపలా కాయడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ‘క్యూ’ కట్టడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
‘అది కనీసం చంద్రబాబు సొంత ఇల్లు కూడా కాదు. అద్దె ఇల్లు.. అయినా, అక్కడికి ఎమ్మెల్యే, మంత్రులు వెళ్ళాల్సిన పనేంటి.? డ్రోన్లతో రాజకీయమేంటి.?’ అని సోషల్ మీడియా వేదికగా సాధారణ ప్రజానీకం సైతం ప్రశ్నిస్తున్నారు. మరోపక్క, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వుందనీ, తమ ప్రభుత్వం బాగా పనిచేస్తోందనీ మంత్రులు చేస్తున్న ప్రకటనలూ వివాదాస్పదమవుతున్నాయి. మంత్రులు, అధికారులు తమను అస్సలేమాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. కేవలం చంద్రబాబు ఇంటిని ముంచాలన్న కుయుక్తితో, సామాన్య ప్రజల జీవితాల్ని పణంగా పెట్టారన్న టీడీపీ వాదనకు సోషల్ మీడియా వేదికగా మద్దతు లభిస్తోంది.
ఫ్లడ్ మేనేజ్మెంట్లో వైఎస్ జగన్ సర్కార్ ఫెయిలయ్యిందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇదంతా తమ మీద జరుగుతున్న దుష్ప్రచారం మాత్రమేనని వైసీపీ అంటోంది. ఏదిఏమైనా, అధినేత విదేశాల్లో వుంటే, వైసీపీ పరిస్థితి ఎంతలా దిగజారిపోతుందో చెప్పడానికి తాజా పరిస్థితులే నిదర్శనం. మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడంతో, ప్రభుత్వానికీ, పార్టీకీ చెడ్డపేరు వస్తోందని అధికార పార్టీకి చెందిన మద్దతుదారులూ సోషల్ మీడియాలో వాపోతుండడం గమనార్హం.
338094 757090Yay google is my world beater assisted me to find this excellent web site! . 12845