తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికకు బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిని ఖరారు చేశారు. మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి రత్నప్రభ తమ అభ్యర్ధిగా ప్రకటిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. రత్నప్రభ గతంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ గా పని చేశారు. ఈ సందర్భంగా రత్నప్రభకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు ఉన్న అపార అనుభవం తిరుపతి అభివృద్ధికి ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మోదీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి ఆమె తీసుకెళ్లగలరని అన్నారు. ప్రజా జీవితంలోనే కొనసాగిన వారి యొక్క సుదీర్ఘ పరిపాలనా అనుభవం తిరుపతి ప్రజలకు లాభిస్తుందన్నారు. రత్నప్రభ డిప్యుటేషన్ పై ఏపీలోనూ పని చేశారు. పదవీ విరమణ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. దీంతో తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధిగా రత్నప్రభకే అధిష్టానం మొగ్గు చూపింది.