‘ఆర్ఆర్ఆర్’ టీమ్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇటివలే టికెట్ల రేట్లపై జీవో తీసుకొచ్చిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా అన్ని తరగతుల టికెట్లపై మొదటి పది రోజులపాటు అదనంగా రూ.75 వరకు పెంచుకునే సౌలభ్యం కల్పించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తూ.. తగిన చర్యలు తీసుకోవాలని జేసీలు, పోలీసులకు ఆదేశాలిచ్చింది.
సినిమా నిర్మాణ వ్యయం రూ.100 కోట్లు దాటిన చిత్రాలకు.. మొదటి పదిరోజులపాటు టికెట్ ధరలు పెట్టుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సీఎం జగన్ ను ఇటివలే కలిసి టికెట్ల రేట్లు పెంచాలని కోరారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సినిమాకు పూర్తవగా యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సినిమా నిడివి 3గంటల 6నిమిషాల 54 సెకన్లుగా ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరో హీరోయిన్లుగా అజయ్ దేవ్ గన్ కీలక పాత్రలో నటించారు.
600026 824168Exceptional weblog here! Also your website loads up really fast! What host are you using? Can I get your affiliate link to your host? I wish my internet site loaded up as quickly as yours lol xrumer 712092
901639 614450Thanks for helping out, exceptional info. 345824