ఎస్ ఎస్ తమన్ కు ట్రోలింగ్ అన్నది కొత్తేమి కాదు. అయితే ఒక్కోసారి వర్క్ పరంగా కాకుండా చెప్పే మాటలతోనూ ట్రోలింగ్ అవుతుంటాడు తమన్. రీసెంట్ గా భగవంత్ కేసరికి వర్క్ చేసాడు. ఆ సినిమాకు బెటర్ ఔట్పుట్ ఇచ్చాడు. ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా దర్శకుడు బాబీ చిత్ర టీమ్ తో ఇంటర్వ్యూ చేసాడు. అందులో మాట్లాడుతూ జీవం లేని సన్నివేశం చచ్చిన శవంతో సమానమని చెప్పాడు.
అలాంటి సన్నివేశాన్ని ఎలాంటి బీజీఎమ్ ఇచ్చినా లేపలేమని తెలిపాడు. ఇక్కడే తమన్ ట్రోలింగ్ కు అవకాశమిచ్చాడు. చాలా యావరేజ్ కంటెంట్ ఉన్న జైలర్ ను బ్లాక్ బస్టర్ చేసింది బీజీఎమ్ అని స్వయంగా రజినీకాంత్ చెప్పి అనిరుద్ ను పొగడ్తలతో ముంచెత్తాడు.
డిజాస్టర్ మూవీస్ కు కూడా అద్భుతమైన పనితనం ఇచ్చిన చరిత్ర ఉంది మణిశర్మ, రహ్మాన్ లాంటి సంగీత దర్శకులకు. ఇప్పుడు ఇదే విషయం మీద తమన్ ను ట్రోల్ చేస్తున్నారు.