Switch to English

మీడియాకు గడ్డు రోజులు మొదలయ్యాయా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,444FansLike
57,764FollowersFollow

మన్మథుడు సినిమాలో తనికెళ్ల భరణి, నాగార్జున మధ్య ఓ డైలాగ్ ఉంటుంది. ‘‘ఆ అమ్మాయి గురించి మీకు తెలియదు.. ముద్ర యాడ్ ఏజెన్సీలో పాతిక వేల జీతానికి పనిచేస్తుంటే బతిమాలి 30వేలకు ఒప్పించి తీసుకొచ్చాను’’ అని భరణి అంటాడు. ‘’30 వేలా? మూడు వేలు ఇస్తే పనిచేయడానికి చాకుల్లాంటి కుర్రాళ్లు బోలెడు మంది దొరుకుతారు’’ అని నాగార్జున అంటాడు. ఇప్పుడు తెలుగు మీడియా సంస్థల ఆలోచన ధోరణి అచ్చం నాగార్జున డైలాగ్ లాగే ఉంది. ఎప్పటి నుంచో సంస్థలోనే పనిచేస్తూ అధిక వేతనం పొందుతున్న సీనియర్లకు మంగళం పాడే దిశగా ప్రధాన మీడియా సంస్థలు కదులుతున్నాయి. వారి బదులు తక్కువ జీతానికి కొత్తవారిని నియమించకుని పని కానిద్దామని భావిస్తున్నాయి. ప్రమాణాలు, నాణ్యత కంటే పైకానికే విలువ ఇస్తున్నాయి.

ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పేరు పొందిన మీడియా పరిస్థితి దయనీయంగా మారడమే ఇందుకు కారణం. ఒకప్పుడు ప్రభుత్వాల్నే శాసించిన మీడియా.. ఇప్పుడు ఉనికి కోసం పాట్లు పడే స్థితికి చేరింది. సోషల్ మీడియా హవా బాగా పెరగడంతో సాంప్రదాయ మీడియాకు గడ్డు కాలం మొదలైంది. ముఖ్యంగా ప్రింట్ మీడియా పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. పెరుగుతున్న ఖర్చులకు తగినంత ఆదాయం లేకపోవడంతో ప్రముఖ మీడియా సంస్థలు సైతం వ్యయ నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. అటు ప్రింట్, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ సాధ్యమైనంత మేర కాస్ట్ కటింగ్ చేపట్టాయి.

ఉద్యోగుల తొలగింపుతోపాటు ఇతరత్రా చర్యలతో ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. తెలుగు మీడియాలో ఇప్పటికే రెండు మూడు ఛానళ్లు మూతపడగా.. ఇటీవల మోజో టీవీకి సైతం మంగళం పాడేశారు. ప్రతి ఉద్యోగికి నాలుగున్నర నెలల వేతనం ఇచ్చి ఆ సంస్థ సెటిల్ చేసుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో టాప్ లిస్ట్ లో ఉండే ఎన్టీవీ సైతం కాస్ట్ కటింగ్ మొదలుపెట్టింది. లక్షల్లో వేతనాలు తీసుకునే సిబ్బందికి ఉద్వాసన పలుకుతోంది. అలాగే టీవీ5, 10 టీవీ కూడా ఇదే బాటలో ఉన్నాయి.

ప్రింట్ మీడియా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏపీలో ప్రభుత్వం మారగానే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముందుగా కాస్ట్ కటింగ్ చేపట్టినా.. ప్రస్తుతం ఈనాడు కూడా ఆ లైన్లోకి వచ్చేసింది. ఫొటోగ్రాఫర్ల వ్యవస్థను మొత్తానికే తీసివేసే దిశగా కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. ప్రస్తుతానికి జర్నలిస్టుల జోలికి వెళ్లకపోయినా.. తదుపరి అడుగు అదే అంటున్నారు.

అధికంగా వేతనాలు పొందుతున్న సిబ్బందిని ఏదో ఒక విధంగా వదిలించుకుని వారి స్థానంలో తమ జర్నలిజం స్కూలు ద్వారా వచ్చేవారిని నియమించుకుని వారితో పత్రిక, టీవీ నడపాలనే యోచన ఉందని చెబుతున్నారు. తెలుగు మీడియాలో పెద్దన్నగా ఉన్న ఈనాడు ఏది పాటిస్తే మిగిలిన సంస్థలు కూడా అదే విధానాన్ని అనుసరిస్తాయి. అంటే త్వరలో తెలుగు మీడియా రంగం కుదుపులకు గురికావడం ఖాయంగా కనిపిస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...