మన్మథుడు సినిమాలో తనికెళ్ల భరణి, నాగార్జున మధ్య ఓ డైలాగ్ ఉంటుంది. ‘‘ఆ అమ్మాయి గురించి మీకు తెలియదు.. ముద్ర యాడ్ ఏజెన్సీలో పాతిక వేల జీతానికి పనిచేస్తుంటే బతిమాలి 30వేలకు ఒప్పించి తీసుకొచ్చాను’’ అని భరణి అంటాడు. ‘’30 వేలా? మూడు వేలు ఇస్తే పనిచేయడానికి చాకుల్లాంటి కుర్రాళ్లు బోలెడు మంది దొరుకుతారు’’ అని నాగార్జున అంటాడు. ఇప్పుడు తెలుగు మీడియా సంస్థల ఆలోచన ధోరణి అచ్చం నాగార్జున డైలాగ్ లాగే ఉంది. ఎప్పటి నుంచో సంస్థలోనే పనిచేస్తూ అధిక వేతనం పొందుతున్న సీనియర్లకు మంగళం పాడే దిశగా ప్రధాన మీడియా సంస్థలు కదులుతున్నాయి. వారి బదులు తక్కువ జీతానికి కొత్తవారిని నియమించకుని పని కానిద్దామని భావిస్తున్నాయి. ప్రమాణాలు, నాణ్యత కంటే పైకానికే విలువ ఇస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పేరు పొందిన మీడియా పరిస్థితి దయనీయంగా మారడమే ఇందుకు కారణం. ఒకప్పుడు ప్రభుత్వాల్నే శాసించిన మీడియా.. ఇప్పుడు ఉనికి కోసం పాట్లు పడే స్థితికి చేరింది. సోషల్ మీడియా హవా బాగా పెరగడంతో సాంప్రదాయ మీడియాకు గడ్డు కాలం మొదలైంది. ముఖ్యంగా ప్రింట్ మీడియా పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. పెరుగుతున్న ఖర్చులకు తగినంత ఆదాయం లేకపోవడంతో ప్రముఖ మీడియా సంస్థలు సైతం వ్యయ నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. అటు ప్రింట్, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ సాధ్యమైనంత మేర కాస్ట్ కటింగ్ చేపట్టాయి.
ఉద్యోగుల తొలగింపుతోపాటు ఇతరత్రా చర్యలతో ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. తెలుగు మీడియాలో ఇప్పటికే రెండు మూడు ఛానళ్లు మూతపడగా.. ఇటీవల మోజో టీవీకి సైతం మంగళం పాడేశారు. ప్రతి ఉద్యోగికి నాలుగున్నర నెలల వేతనం ఇచ్చి ఆ సంస్థ సెటిల్ చేసుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో టాప్ లిస్ట్ లో ఉండే ఎన్టీవీ సైతం కాస్ట్ కటింగ్ మొదలుపెట్టింది. లక్షల్లో వేతనాలు తీసుకునే సిబ్బందికి ఉద్వాసన పలుకుతోంది. అలాగే టీవీ5, 10 టీవీ కూడా ఇదే బాటలో ఉన్నాయి.
ప్రింట్ మీడియా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏపీలో ప్రభుత్వం మారగానే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముందుగా కాస్ట్ కటింగ్ చేపట్టినా.. ప్రస్తుతం ఈనాడు కూడా ఆ లైన్లోకి వచ్చేసింది. ఫొటోగ్రాఫర్ల వ్యవస్థను మొత్తానికే తీసివేసే దిశగా కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. ప్రస్తుతానికి జర్నలిస్టుల జోలికి వెళ్లకపోయినా.. తదుపరి అడుగు అదే అంటున్నారు.
అధికంగా వేతనాలు పొందుతున్న సిబ్బందిని ఏదో ఒక విధంగా వదిలించుకుని వారి స్థానంలో తమ జర్నలిజం స్కూలు ద్వారా వచ్చేవారిని నియమించుకుని వారితో పత్రిక, టీవీ నడపాలనే యోచన ఉందని చెబుతున్నారు. తెలుగు మీడియాలో పెద్దన్నగా ఉన్న ఈనాడు ఏది పాటిస్తే మిగిలిన సంస్థలు కూడా అదే విధానాన్ని అనుసరిస్తాయి. అంటే త్వరలో తెలుగు మీడియా రంగం కుదుపులకు గురికావడం ఖాయంగా కనిపిస్తోంది.
189453 626257I agree completely with what you said. Fantastic Stuff. Keep it going.. 783622
792264 578512Great paintings! That is the kind of info that are supposed to be shared around the internet. 830836
292215 512093Hey, you used to write fantastic, but the last few posts have been kinda boringK I miss your wonderful writings. Past couple of posts are just a bit out of track! come on! 15885