Switch to English

పరీక్షలు పెంచాల్సిందేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

‘తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తుండటం వల్లే ఈ ఫలితం సాధించగలిగాం. ప్రజలు మరికొంత కాలం సహకరిస్తే పూర్తిగా ఈ మహమ్మారి నుంచి బయటపడొచ్చు’ – ఇదీ సీఎం కేసీఆర్ ఆదివారం ప్రజలకు చేసిన వినతి.

నిజంగా ఇది మంచి పరిణామమే. రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. పల్లెల్లో లాక్ డౌన్ వంద శాతం పక్కాగా అమలవుతోంది. కానీ నగరాలు, పట్టణాల్లో మాత్రం ఉల్లంఘనలు సాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఇవీ మరీ ఎక్కువ. తాజాగా నమోదవుతున్న కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. మరోవైపు లాక్ డౌన్ అమలు విషయంలో ఎంతో కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కారు.. కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో మాత్రం అలా వ్యవహరించడంలేదు.

తెలంగాణ మొత్తంగా ఇప్పటివరకు 18,756 పరీక్షలు మాత్రమే చేశారు. సాధారణంగా కరోనా లక్షణాలు ఉన్నవారికి, పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ అయినవారికి ఈ పరీక్షలు నిర్వహిస్తే చాలు. కానీ జిత్తులమారి కరోనా ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటోంది. పరిస్థితులకు తగినట్టుగా తనను తాను అప్ గ్రేడ్ చేసుకుంటోంది. లక్షణాలు లేనివారికి కూడా పాజిటివ్ వస్తోంది.

మహారాష్ట్రలో దాదాపు 80 శాతం మంది కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలూ లేవు. తెలంగాణలో సైతం ఇలాంటి కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఎంత ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే అంత మంచిది. కాంటాక్ట్ కేసులు, వారికి సన్నిహితంగా ఉన్నవారితోపాటు ర్యాండమ్ గా ఈ పరీక్షలు చేయడం వల్ల దాగి ఉన్న వైరస్ కేసులను వెలికి తీయొచ్చని చెబుతున్నారు. ఒకవేళ అలా చేయకుంటే లక్షణాలు కనిపించని వ్యక్తుల ద్వారా మరింత మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.

ఒక్క కేసు కూడా నమోదు కాని రోజు నుంచి కనీసం 20 రోజులపాటు పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేసినప్పుడే ఈ మహమ్మారిని నిరోధించగలుగుతామని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవి ఎండలకు ఈ వైరస్ మనలేదని తొలుత వార్తలు వచ్చినా.. ఇప్పుడు ఆ ఆశ కూడా లేదని వివరిస్తున్నారు. ఈ వైరస్ మరింత శక్తివంతమైందని, 92 డిగ్రీల వేడి వద్ద 15 నిమిషాలపాటు ఇది బతుకుతోందని తాజా పరిశోధనలో వెల్లడైందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పక్కాగా పాటించడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఆవశ్యకమని స్పష్టంచేస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...