Switch to English

కమలం, ఫ్యాను మధ్య సంధి కుదిరిందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ప్రపంచాన్ని కరోనా కుమ్మేస్తున్న సమయంలోనూ ఏపీలో మాత్రం హాట్ హాట్ రాజకీయాలు సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఓ దశలో తెలుగుదేశం పార్టీ కంటే బీజేపీనే అధికార వైసీపీపై విరుచుకుపడింది. కరోనా టెస్టు కిట్ల కొనుగోలులో గోల్ మాల్ జరిగిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేశారు. దీనికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధీటుగా కౌంటరిచ్చారు.

సుజనా చౌదరికి కన్నా రూ.20 కోట్లకు అమ్ముడుపోయారని, ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం పంపించిన సొమ్మును నొక్కేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కన్నా సైతం ధీటుగా స్పందిస్తూ.. విజయసాయిరెడ్డిని జైలు పక్షి అని, దమ్ముంటే కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అని సవాల్ చేశారు. దీనికి సాయిరెడ్డి సానుకూలంగానే స్పందించారు. కాణిపాకం ఎప్పుడు వస్తారంటూ ప్రశ్నించారు. ఇలా వైసీపీ, బీజేపీ మధ్య రెండు మూడు రోజులపాటు సాగిన వాగ్యుద్ధం ఒక్కసారిగా చల్లబడింది.

అసలు తమ మధ్య ఎలాంటి విమర్శలు జరగలేదు అనేంతగా ఇరువర్గాలూ సైలెంటయిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం బీజేపీ అధిష్టానం కన్నా ఎపిసోడ్ ని లైట్ తీసుకోవడమేననే గుసగుసలు వినిపిస్తున్నాయి. సాయిరెడ్డి చేసిన ఆరోపణలను కన్నా తమ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, అక్కడ నుంచి సరైన స్పందన రాలేదని తెలుస్తోంది.

వైసీపీ ట్రాప్ లో పడకుండా కరోనాపై అందరం కలిసికట్టుగా పోరాడాలని సూచించినట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ స్టాండ్ ఏమిటనేది ఎవరికీ అంతుబట్టని విషయంగా మారిపోయింది. పార్టీలోని కొందరు టీడీపీ అనుకూలంగా వ్యవహరిస్తుండగా.. మరికొంతమంది వైసీపీ సానుకూల వైఖరి అవలంభిస్తున్నారు. అసలు ఢిల్లీ పెద్దల వైఖరి ఏమిటనేది కూడా ఎవరికీ తెలియడంలేదు.

సాయిరెడ్డి తమ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసినా.. ఒక్కరు కూడా వాటిని ఖండించలేదు. దీంతో వైసీపీకి, బీజేపీ పెద్దలకు మధ్య సత్సంబంధాలు ఉండి ఉంటాయనే భావన రాష్ట్ర బీజేపీ నేతల్లో బలపడుతోంది. దీంతోనే కన్నా ఎపిసోడ్ ను పక్కన పెట్టేశారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు కన్నా సైతం తత్వం బోధపడి ఆ ఎపిసోడ్ కు ముగింపు పలికినట్టుగా తెలుస్తోంది. అందువల్లే ఈ వ్యవహారం ప్రస్తుతానికి చల్లబడింది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...