తెలుగుదేశం పార్టీ నిండా మునిగిపోయింది. కానీ, ఇంకా ఇంకా ముంచేస్తేనేగానీ కసి తీరదన్నట్టు తెలుగు తమ్ముళ్ళు వ్యవహరిస్తున్నారు. పార్టీ అధినేత దగ్గర్నుంచి, కింది స్థాయి నాయకుల దాకా అందరిదీ ఇదే రూటు. ఒక్కరంటే ఒక్కరు కూడా పార్టీకి మంచి భవిష్యత్తు వుంటుందన్న ధీమాతోగానీ, వుండాలన్న కనీసపాటి ఆశతోగానీ కనిపించడంలేదు.
స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడు జూనియర్ నందమూరి తారకరామారావు మీద పడి ఏడుస్తున్నారిప్పుడు తెలుగు తమ్ముళ్ళు. చంద్రబాబు సతీమణిని వైసీపీ నేతలు కొందరు అసభ్యకరమైన పదజాలంతో దూషించారన్నది చంద్రబాబు అండ్ టీమ్ గత కొద్ది రోజులుగా చేస్తున్న ఆరోపణ.
అలా దూషణలకు దిగిన నేతలెవరున్నారో, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన సోకాల్డ్ టీడీపీ సీనియర్ నేతలు, అనూహ్యంగా జూనియర్ ఎన్టీయార్ మీదకి తమ ‘ఆయుధాల్ని సంధించడం’ మొదలు పెట్టారు. ఇదెక్కడి చోద్యం.?
ఈ నాయకులే, మొన్నామధ్య విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీని నిండా ముంచేశారు. అప్పట్లో టీడీపీని ముంచేసి, ఇప్పుడు ఇంకా టీడీపీని చంపేయాలన్న కోణంలో జూనియర్ ఎన్టీయార్ని వివాదాల్లోకి లాగారు.
‘అన్నా తారక్ అన్నా.. ఓ సారి మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వు అన్నా..’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులైన టీడీపీ మద్దతుదారులు కొందరు సోషల్ మీడియా వేదికగా బతిమాలుకుంటున్నారు తమ అభిమాన నటుడ్ని.
‘స్పందించాడు కదా.. ఇంకా వివాదమెందుకు.? జూనియర్ ఎన్టీయార్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పార్టీకే నష్టం..’ అంటూ ఇంకొందరు వాపోతున్నారు. టీడీపీ మారదుగాక మారదు. అయినా, టీడీపీకి వేరే శతృవులే అవసరం లేదు. టీడీపీని నాశనం చేసెయ్యడానికి టీడీపీ నాయకులే చాలు.
917010 260818extremely great put up, i actually really like this internet web site, maintain on it 436843
278655 483737Excellent blog, Im going to spend much more time reading about this topic 648288