Switch to English

వైఎస్ జగన్‌పై టీడీపీ ఛార్జిషీట్.! రెండు లక్షల కోట్లు దోచేశారట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

సీబీఐ, ఈడీ, సీఐడీ వంటి దర్యాప్తు సంస్థలు వేసే ఛార్జిషీట్లకే దిక్కు వుండటంలేదు.. మరి, రాజకీయ పార్టీలు ప్రకటించే ఛార్జిషీట్లకు వీసమెత్తు విలువైనా వుంటుందా.? అంటే, ఈ పొలిటికల్ ఛార్జిషీట్లు.. ప్రజా కోర్టులో ఒక్కోసారి గట్టిగానే ప్రభావం చూపుతాయ్ మరి.! న్యాయస్థానాల్లో ఆయా దర్యాప్తు సంస్థలు నమోదు చేసే ఛార్జిషీట్లకు సంబంధించి శిక్షలు పడటం అనేది ఓ పెద్ద ప్రసహనం. రాజకీయ చార్జిషీట్లతో మాత్రం ఒక్కోసారి ఫలితం చాలా వేగంగా వస్తుంటుంది.

అసలు విషయంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ తాజాగా ఛార్జిషీటుని తీసుకొచ్చింది.. అదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద. గడచిన మూడేళ్ళ పాలన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ నమోదు చేసిన ఛార్జిషీటులో దోపిడీ విలువ ఎంతో తెలుసా.? అక్షరాలా రెండు లక్షల కోట్ల రూపాయలు.!

సీబీఐ గతంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సుమారు 43 వేల కోట్ల రూపాయల అక్రమాలంటూ ఛార్జిషీట్లు దాఖలు చేసిన విషయం విదితమే. అంతకు ముందు టీడీపీ ఆరోపణలు.. లక్ష కోట్ల రూపాయల అవినీతి.. అంటూ జరిగాయి. మరిప్పుడు, టీడీపీ ప్రకటించిన పొలిటికల్ ఛార్జిషీటు తాలూకు ప్రభావం ఎలా వుండబోతోంది.? 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి.. అంటూ వైఎస్ జగన్ మీద టీడీపీ చేస్తోన్న ఆరోపణల్లో నిజమెంత.?

దేశంలో అవినీతి రహిత పాలన.. అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అవినీతి వ్యవస్థీకృతమైపోయి దశాబ్దాలు గడుస్తోంది. ఇందుగలదందు లేదని సందేహము వలదు.. అన్నట్టు తయారైంది అవినీతి పరిస్థితి. టీడీపీ హయాంలో కేవలం టీడీపీ మద్దతుదారులైన కాంట్రాక్టర్లకే పనులు దక్కాయ్.. వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన వారికి మాత్రమే కాంట్రాక్టులు దక్కుతున్నాయ్. కాంట్రాక్టులంటేనే అవినీతి.! ఆ లెక్కన అవినీతి లేకుండా ఎలా వుంటుంది.?

ఇసుకని దోచేస్తున్నారు.. మట్టిని దోచేస్తున్నారు.. అసలు దోచెయ్యనిదంటూ ఏమైనా వుందా.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతికి చెందిన సంస్థలకు ప్రభుత్వం తరఫున ఎన్ని ‘వెసులుబాట్లు’ కలుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాక్షి మీడియానే తీసుకుంటే, అందులో పనిచేసినోళ్ళకి ప్రభుత్వంలో కీలకమైన నామినేటెడ్ పదవులు దక్కిన విషయం విదితమే.

చెప్పుకుంటూ పోతే చాలానే కథ వుంది. ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే, రెండు లక్షల కోట్లేంటి.? అంతకు మించిన అవినీతి జరిగి వుండొచ్చన్న చర్చ జనబాహుళ్యంలో జరుగుతోంది.

ల్యా0డ్ మాఫియా 20 వేల కోట్లు, శాండ్ మాఫియా 10 వేల కోట్లు, మైనింగ్ మాఫియా 35 వేల కోట్లు, మద్యం మాఫియా 26 వేల కోట్లు, డ్రగ్స్ మాఫియా 21 వేల కోట్లు, లేపాక్షి ల్యాండ్ స్కామ్ 15 వేల కోట్లు, గంజాయి మాఫియా 10 వేల కోట్లు, రేషన్ బియ్యం మాఫియా 7 వేల కోట్లు, ఎర్ర చందనం మాఫియా 25 వేల కోట్లు, సిమెంటు మాఫియా 12 వేల కోట్లు, సెంటు పట్టాలో లూటీ 7 వేల కోట్లు.. అంబులెన్స్, బియ్యం వ్యాన్లు, ఇతరాల్లో 10 వేల కోట్లు.. ఇదీ టీడీపీ చార్జిషీటులోని ముఖ్యాంశాలు.!

వైఎస్ జగన్‌పై టీడీపీ ఛార్జిషీట్.! రెండు లక్షల కోట్లు దోచేశారట.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...