సీబీఐ, ఈడీ, సీఐడీ వంటి దర్యాప్తు సంస్థలు వేసే ఛార్జిషీట్లకే దిక్కు వుండటంలేదు.. మరి, రాజకీయ పార్టీలు ప్రకటించే ఛార్జిషీట్లకు వీసమెత్తు విలువైనా వుంటుందా.? అంటే, ఈ పొలిటికల్ ఛార్జిషీట్లు.. ప్రజా కోర్టులో ఒక్కోసారి గట్టిగానే ప్రభావం చూపుతాయ్ మరి.! న్యాయస్థానాల్లో ఆయా దర్యాప్తు సంస్థలు నమోదు చేసే ఛార్జిషీట్లకు సంబంధించి శిక్షలు పడటం అనేది ఓ పెద్ద ప్రసహనం. రాజకీయ చార్జిషీట్లతో మాత్రం ఒక్కోసారి ఫలితం చాలా వేగంగా వస్తుంటుంది.
అసలు విషయంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ తాజాగా ఛార్జిషీటుని తీసుకొచ్చింది.. అదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద. గడచిన మూడేళ్ళ పాలన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ నమోదు చేసిన ఛార్జిషీటులో దోపిడీ విలువ ఎంతో తెలుసా.? అక్షరాలా రెండు లక్షల కోట్ల రూపాయలు.!
సీబీఐ గతంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సుమారు 43 వేల కోట్ల రూపాయల అక్రమాలంటూ ఛార్జిషీట్లు దాఖలు చేసిన విషయం విదితమే. అంతకు ముందు టీడీపీ ఆరోపణలు.. లక్ష కోట్ల రూపాయల అవినీతి.. అంటూ జరిగాయి. మరిప్పుడు, టీడీపీ ప్రకటించిన పొలిటికల్ ఛార్జిషీటు తాలూకు ప్రభావం ఎలా వుండబోతోంది.? 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి.. అంటూ వైఎస్ జగన్ మీద టీడీపీ చేస్తోన్న ఆరోపణల్లో నిజమెంత.?
దేశంలో అవినీతి రహిత పాలన.. అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అవినీతి వ్యవస్థీకృతమైపోయి దశాబ్దాలు గడుస్తోంది. ఇందుగలదందు లేదని సందేహము వలదు.. అన్నట్టు తయారైంది అవినీతి పరిస్థితి. టీడీపీ హయాంలో కేవలం టీడీపీ మద్దతుదారులైన కాంట్రాక్టర్లకే పనులు దక్కాయ్.. వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన వారికి మాత్రమే కాంట్రాక్టులు దక్కుతున్నాయ్. కాంట్రాక్టులంటేనే అవినీతి.! ఆ లెక్కన అవినీతి లేకుండా ఎలా వుంటుంది.?
ఇసుకని దోచేస్తున్నారు.. మట్టిని దోచేస్తున్నారు.. అసలు దోచెయ్యనిదంటూ ఏమైనా వుందా.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతికి చెందిన సంస్థలకు ప్రభుత్వం తరఫున ఎన్ని ‘వెసులుబాట్లు’ కలుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాక్షి మీడియానే తీసుకుంటే, అందులో పనిచేసినోళ్ళకి ప్రభుత్వంలో కీలకమైన నామినేటెడ్ పదవులు దక్కిన విషయం విదితమే.
చెప్పుకుంటూ పోతే చాలానే కథ వుంది. ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే, రెండు లక్షల కోట్లేంటి.? అంతకు మించిన అవినీతి జరిగి వుండొచ్చన్న చర్చ జనబాహుళ్యంలో జరుగుతోంది.
ల్యా0డ్ మాఫియా 20 వేల కోట్లు, శాండ్ మాఫియా 10 వేల కోట్లు, మైనింగ్ మాఫియా 35 వేల కోట్లు, మద్యం మాఫియా 26 వేల కోట్లు, డ్రగ్స్ మాఫియా 21 వేల కోట్లు, లేపాక్షి ల్యాండ్ స్కామ్ 15 వేల కోట్లు, గంజాయి మాఫియా 10 వేల కోట్లు, రేషన్ బియ్యం మాఫియా 7 వేల కోట్లు, ఎర్ర చందనం మాఫియా 25 వేల కోట్లు, సిమెంటు మాఫియా 12 వేల కోట్లు, సెంటు పట్టాలో లూటీ 7 వేల కోట్లు.. అంబులెన్స్, బియ్యం వ్యాన్లు, ఇతరాల్లో 10 వేల కోట్లు.. ఇదీ టీడీపీ చార్జిషీటులోని ముఖ్యాంశాలు.!
797719 635187You got a extremely wonderful website, Glad I observed it by means of yahoo. 302273