Switch to English

అసెంబ్లీ సమావేశాల బాయ్‌‌కాట్: అప్పుడు చేసిందేటి చెప్మా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

కరోనా నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్ని సజావుగా నిర్వహించుకోలేని దుస్థితి ఏర్పడింది ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి. దేశంలో చాలా రాష్ట్రాలు బడ్జెట్ సమావేశాల్ని ఒకింత సజావుగానే నిర్వహించుకోగలిగాయి. కేవలం ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఈ భిన్నమైన పరిస్థితి ఎందుకు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఇక్కడి రాజకీయ పరిస్థితులు అలాంటివి. కాదేదీ రాజకీయానికి అనర్హం.. అన్నట్టు తయారైంది పరిస్థితి ఏపీలో.

స్థానిక ఎన్నికలు సహా అనేక కారణాలతో అసెంబ్ల బడ్జెట్ సమావేశాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే ఆర్డినెన్స్ ద్వారా తాత్కాలిక బడ్జెట్ పెట్టుకోవాల్సి వచ్చింది. పద్ధతి ప్రకారం అసెంబ్లీలో బడ్జెట్ పెట్టి, ఆమోదించుకోవాలి గనుక.. ఒక్క రోజు బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్కరోజు సమావేశానికి హాజరైతే ఎంత.? అవ్వకపోతే ఎంత.? అన్న కోణంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, అసెంబ్లీ సమావేశాల్ని బాయ్‌‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. అయితే, టీడీపీ తీరుని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది హేయమైన చర్య.. అంటోంది. ఇదెక్కడి వింత వాదన.?

చంద్రబాబు హయాంలో వైసీపీ, కారణం లేకుండా అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించేసినప్పుడు ఈ ‘హేయం’ అన్న ప్రస్తావన ఎందుకు రాలేదట.? అప్పట్లో వైసీపీకి చెప్పుకోదగ్గ సంఖ్యలో శాసనసభ్యులున్నారు. కానీ, వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు మొత్తం వైసీపీ శాసనసభ్యులంతా డుమ్మా కొట్టేశారు. సరే, అది తప్పా.? ఒప్పా.? అన్నది వేరే చర్చ. నైతికత అయితే కాదు. ఇప్పుడు టీడీపీ విషయంలోనూ అంతే.

అయితే, టీడీపీకి అసెంబ్లీలో ప్రాతినిథ్యం తక్కువ వుండడం, అధికార పార్టీ సభ్యులు కేవలం వ్యక్తిగత ధూషణలకే ఎక్కువ సమయాన్ని వినియోగిస్తుండడం.. ఈ కారణాలతోనే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్ని బాయ్‌‌కాట్ చేస్తున్నామని టీడీపీ చెబుతోంది. టీడీపీ బాయ్‌‌కాట్ చేయడం వల్ల అధికార పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. సభను సజావుగా జరుపుకోవచ్చు. కానీ, టీడీపీ ఎందుకు బాయ్‌‌కాట్ చేస్తోంది.? అంటూ వైసీపీ నేతలు అమాయకంగా ప్రశ్నించడం ఏదైతే వుందో, అది అధికార పార్టీ అసహనాన్ని బయటపెట్టేస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ఎక్కువ చదివినవి

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...