మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటుని ఆఫర్ చేసిందట.. అంటూ జరుగుతున్న ప్రచారం వల్ల జనసేన పార్టీకి వచ్చే నష్టమెంత.? లాభమేంటి.? అన్న అంశం చుట్టూ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
జనసేన పార్టీని దెబ్బకొట్టే వ్యూహంతో వైసీపీ, చిరంజీవికి రాజ్యసభ సీటుని ఆఫర్ చేసిందన్నది టీడీపీ అను‘కుల’ మీడియా చేస్తున్న ప్రచారం. అసలు, ఈ ప్రచారం జరగడానికి మూల కారణం వైసీపీ అను‘కుల’ మీడియా. వైసీపీ నుంచి వచ్చిన లీకులకు టీడీపీ ఆజ్యం పోసింది. అలా మెగా రాజకీయం, సంక్రాంతి వేళ హాట్ టాపిక్ అయ్యింది తెలుగు మీడియాలో.
మెగాస్టార్ చిరంజీవి, ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేశారు. దాంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ.. రెండూ డీలాపడ్డాయి. నిజానికి, వైసీపలో కొందరు ‘కాపు’ నేతలు, చిరంజీవిపై మమకారం పెంచుకున్నారు. చిరంజీవికి రాజ్యసభ సీటు విషయమై వైసీపీలో అంతర్గతంగా చర్చ జరగడానికి కారణం వాళ్ళే.
తెలుగుదేశం పార్టీలోనూ ఇదే పరిస్థితి. గత కొద్ది రోజులుగా ‘కాపు’ ప్రముఖులు ఏర్పాటు చేసుకుంటున్న ప్రత్యేక సమావేశాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ల గురించిన చర్చ జరుగుతోంది. కాపు సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడ్ని రాజకీయ తెరపై అత్యున్నత స్థానంలో వుంచాలన్న వాదన ఆ సామాజిక వర్గ ప్రముఖుల్లో కనిపిస్తోంది.
దాంతో, ఇటు టీడీపీ.. అటు వైసీపీ.. అత్యంత వ్యూహాత్మకంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ల ఇమేజ్ డ్యామేజీ చేయడానికి కంకణం కట్టుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే, కాపు సామాజిక వర్గం ఒక్కతాటిపైకొస్తే, టీడీపీతో పాటు వైసీపీ కూడా తెలుగునాట రాజకీయ తెరపైనుంచి గల్లంతయిపోయే ప్రమాదముంది.
ఏదిఏమైనా, చిరంజీవి చుట్టూ టీడీపీ, వైసీపీ కట్టిన అబద్ధాల కోట బద్దలైపోయింది. అది జనసేన పార్టీకి అడ్వాంటేజ్ అవుతోంది కూడా. ఎందుకంటే, ఇలాంటి చర్యలతోనే కాపు సామాజిక వర్గం ఒక్కతాటిపైకి వస్తుంది.. అదే సమయంలో, ఇతర సామాజిక వర్గాలు కూడా ఆ రెండు పార్టీల రాజకీయ పైత్యాన్ని అర్థం చేసుకుంటాయి.
128489 743533I gotta favorite this website it seems very beneficial . 111211
188549 59295bathroom towels need to be maintained with a excellent fabric conditioner so that they will last longer:: 54295