పీవీ నరసింహారావుగా సుప్రసిద్ధులైన పాములపర్తి వెంకట నరసింహారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యావత్ భారతావని గర్వించదగ్గ తెలుగు ముద్దు బిడ్డ. తెలంగాణలోని ఓ మారుమూల పల్లెలో పుట్టి 17 భాషల్లో పట్టు సాధించి, దేశానికి ప్రధానిగా పనిచేసిన ఆయన.. కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన తీరు అత్యద్భుతం. తన మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడపడమే కాకుండా ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచంలో భారత్ ధీటైన శక్తిగా ఎదగడానికి ఎంతగానో కృషి చేసి చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు.
రాజకీయ దురంధరుడిగా, బహుభాషా కోవిదుడిగా, రాజనీతిజ్ఞుడిగా, ప్రతిభకే పట్టం కట్టే అసమాన్యుడిగా ఆయన ఖ్యాతి ఆచంద్రతారార్కం నిలిచే ఉందనడం నిస్సందేహం. ఆదివారం పీవీ వందో జయంతి. ఇప్పటికే పీవీ శతజయంతి వేడుకలు ఏడాది పాటు నిర్వహించడానికి తెలంగాణలోని కేసీఆర్ సర్కారు చక్కని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పీవీపై ప్రత్యేక కథనం..
1991 జూన్ 21న భారతదేశ తొమ్మిదో ప్రధానిగా పీవీ పగ్గాలు చేపట్టేనాటికి దేశ ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది. మన ఎకానమీ దాదాపుగా ఐసీయూలో ఉంది. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా రూపాయి లేని పరిస్థితి. ద్రవ్య లోటు గతంలో ఎన్నడూ లేనంత పాతాళానికి పడిపోయింది. ఇక అప్పులైతే జీడీపీలో 53 శాతానికి పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం చరిత్రలో ఎన్నడూ లేనంతగా 12.7 శాతానికి ఎగబాకింది. ఈ పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నరసింహారావు తక్షణమే ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ను ఆర్థికమంత్రిగా నియమించి ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. లైసెన్స్ రాజ్ వ్యవస్థను తొలగించడం, పన్నులు తగ్గించడం, మార్కెట్లను పునర్వ్యవస్థీకరించడం, విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడం వంటి చర్యలతో ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో దౌడు తీయించారు. వీరిద్దరూ కలిసి తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఎంతగానో దోహదపడ్డాయి. ముఖ్యంగా పదవిలోకి వచ్చి పది రోజులు కూడా కాకముందే డాలర్ తో రూపాయి మారక విలువను 9 శాతం తగ్గించారు. మరో రెండు రోజులకు 11 శాతం తగ్గించారు. దీనిపై కొందరి నుంచి విమర్శలు వచ్చినా.. పీవీ వాటిని పట్టించుకోకుండా ముందుకే వెళ్లారు.
ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం. ఇలా పలు అంశాల్లో పీవీ, మన్మోహన్ లు తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదాయి. అనంతరం వచ్చిన ప్రభుత్వాలు కూడా పీవీ బాటలోనే సాగడంతో ప్రపంచంలో భారత్ బలమైన దేశంగా ఎదిగింది. సాఫ్ట్ వేర్, ఫార్మా రంగాల్లో అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తోంది. ఇవన్నీ కూడా పీవీ చలవే.
పాలనలో తనదైన ముద్ర వేసిన పీవీ.. రాజకీయంగానూ అపర చాణక్యుడిగానే నిర్ణయాలు తీసుకున్నారు. సంకీర్ణ సర్కారులో ఉండే తలనొప్పులను తట్టుకోవడమే కష్టమనుకుంటే సొంత పార్టీ నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. పదవిలో ఉన్నప్పుడు, తర్వాత కూడా రాజకీయ కారణాలతో పలు కేసులు పెట్టి పీవీని ఇబ్బంది పెట్టారు. 1996 నుంచి 2002 వరకు పలుమార్లు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే, ముక్కుసూటిగా, రాజ్యాంగబద్ధంగా పనిచేసిన పీవీ ఆ కేసులన్నింటి నుంచి విముక్తుడయ్యారు.
ప్రధాని ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకుల విషయంలో కూడా ఆయన ఎంతో హూందాగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి చెందిన సుబ్రమణ్యస్వామికి కేబినెట్ హోదా కల్పించినా.. ఐక్యరాజ్యసమితిలో కీలక సమావేశానికి భారత ప్రతినిధిగా వాజ్ పేయిని పంపించినా అది ఒక్క పీవీకే సాధ్యం. అలాంటి పీవీకి మన దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ఇచ్చి గౌరవించుకోవడం భారతీయులుగా మన బాధ్యత. ప్రపంచంలో భారత్ ను ఠీవీగా తలెత్తుకునేలా చేసిన పీవీ.. తెలుగు బిడ్డ కావడం మనకు ఎంతో గర్వకారణం. ఆయన్ను సదా స్మరించుకోవడం మన కర్తవ్యం. సాహో పీవీ.
808735 7278Enjoyed reading this, very good stuff, thankyou . 80252
366716 329726Maintain websiteing stuff like this I actually am fond of it 841837
506642 442935This internet web site is my aspiration, very outstanding style and style and Perfect topic matter. 740674