మనం కూడా రాజకీయం చేద్దాం.! ఈ మాట కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవ్వుతూ పార్టీ కార్యకర్తల సాక్షిగా అన్నారు. ఔను, రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి. అప్పుడే అది రాజకీయం అవుతుంది. రాజకీయం అంటే సేవ.. అన్నది ఒకప్పటి మాట. రాజకీయాల్లోకి సేవ చేసేందుకు వచ్చేవాళ్ళ సంఖ్య దాదాపు శూన్యమైపోయాక.. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చిత్తశుద్ధితో సేవ చేస్తానంటే.. జనం ఓడించి తీరతారు.. గతంలో అదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవికి ఎదురైన అనుభవమూ ఇదే.
‘అయినా, రాజకీయాల్లో అవినీతిపరులు కానోళ్ళెవరు.?’ అన్న మాటకి జనం స్టిక్ ఆన్ అయిపోయారు. ‘ఎవడొచ్చినా, అడ్డగోలుగా దోచేస్తాడు. ఈ దోపిడీని మనం ఆపలేం. ఆ దోపిడీలో మనమూ భాగమైపోదాం..’ అని జనం అనుకోబట్టే, సంక్షేమ పథకాల ముసుగులో ఓటు బ్యాంకు రాజకీయాలు ఎక్కువైపోయాయ్.
సరే, అదంతా వేరే చర్చ. అసలు ఈ చర్చ ఇప్పుడెందుకు.? అంటే, పిఠాపురం నియోజకవర్గంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ‘పవన్ కళ్యాణ్ గనుక కూటమి తరఫున పోటీ చేస్తే, ఆయన్ని లక్ష మెజార్టీతో గెలిపిస్తాను. అసలు పవన్ కళ్యాణ్ ప్రచారానికి కూడా రావాల్సిన పనిలేదు. ఆయన్ని గెలిపిస్తాను.. ఆ విజయాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి ఆయనకి ఇస్తాను..’ అని కొన్నాళ్ళ క్రితం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సెలవిచ్చారు.
ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి పిఠాపురం టిక్కెట్ ఖాయమైందో, ఆ వెంటనే వర్మ ప్లేటు ఫిరాయించాడు. టీడీపీ కార్యకర్తల్ని, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా నినదించేలా చేశాడు వర్మ. ఏమయ్యిందోగానీ, వర్మ సర్దుకుపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారాయ్.
వర్మ మద్దతిచ్చినా, ఇవ్వకపోయినా.. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి లక్ష మెజార్టీ ఖాయమన్న ప్రచారం తెరపైకొచ్చింది. పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ విన్నా ఇదే చర్చ. దాంతో, వర్మ ఖంగు తిన్నాడు. వెంటనే, పవన్ కళ్యాణ్కి బాహాటంగా మద్దతు పలికాడు.
ఇంకేముంది.? వివాదం సమసిపోయినట్లే.! ఏమో, వర్మ ప్లేటు ఫిరాయిస్తే.? వైసీపీతో చేతులు కలిపితే.? ఈ అనుమానాలు అటు టీడీపీలో, ఇటు జనసేనలో వున్నాయి. ఆ అనుమానాలకు ఆస్కారం లేకుండా, ‘నా గెలుపు బాధ్యత వర్మదే..’ అని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ‘ఔను, పవన్ కల్యాణ్ గెలుపు బాధ్యత నాది’ అని వర్మ కూడా చెప్పాల్సి వచ్చింది.
ఇప్పుడిది వర్మకి ‘ఇజ్జత్ కా సవాల్’ అయిపోయింది. టీడీపీ కార్యకర్తలు ఎప్పుడూ లేనంత యాక్టివ్ అవుతున్నారు పిఠాపురం నియోజకవర్గంలో. జనసేన శ్రేణులతో మరింత సోదర భావంతో వుంటున్నారు. టీడీపీ – జనసేన – బీజేపీ కార్యకర్తలు పిఠాపురంలో కలిసి పని చేస్తున్న తీరు అధికార వైసీపీకి పెద్ద షాక్ ఇస్తోంది.
ఔను, పవన్ కళ్యాణ్ రాజకీయం మొదలు పెట్టారు.! ఇంతకు ముందెన్నడూ పవన్ కళ్యాణ్లో కనిపించని రాజకీయమిది.! కేవలం పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు, తాడేపల్లి గూడెం కావొచ్చు, నిడదవలో కావొచ్చు, నర్సాపురంలో కావొచ్చు, మరో నియోజకవర్గంలో కావొచ్చు.. జనసేన అభ్యర్థుల గెలుపు తమ బాధ్యత అని స్థానిక టీడీపీ నేతలు చెబుతున్నారు.
మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థుల గెలుపు తమ బాద్యత అని జనసేన శ్రేణులూ చెప్పగలుగుతున్నాయి. ఇదీ రాజకీయమంటే.! స్ట్రైక్ రేట్ 98 శాతం వుండాలని గతంలో జనసేనాని అన్నారుగానీ, ఇప్పుడైతే 100 శాతం స్ట్రైక్ రేట్ దిశగా జనసేన దూసుకుపోతోంది.! రాజకీయం అంటే ఇలానే చెయ్యాలి.! రాజకీయం బాగా వంటబట్టేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి.
Keep this going please, great job!