రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ, మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తన తండ్రి హత్య కేసులో పురోగతి లేదని.. కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి వేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది.
సీబీఐ కేసు విచారణలో ఎటువంటి పురోగతి లేదనీ.. ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదనీ.. కేసులో నిందితులుగా ఉన్నవారు బెయిల్ పై బయటకు వచ్చి సాక్షులను బెదిరిస్తున్నారని సునీత తరపు లాయర్ సిద్ధార్ధ లూద్రా వాదనలు వినిపించారు. సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని కూడా కోర్టుకు తెలిపారు.
దీంతో విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్.షా, జస్టిస్ కృష్ణమురారి.. ఏపీ ప్రభుత్వానికి, సీబీఐకు నోటీసులు జారీ చేసింది. సునీతా రెడ్డి లేవనెత్తిన అంశాలపై అక్టోబర్ 14లోపు సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేస్తూ.. కేసును అప్పటికి వాయిదా వేసింది.
624773 162905Enjoyed searching at this, quite great stuff, thanks . 755402
65832 771250extremely nice post, i undoubtedly actually like this superb web site, carry on it 171809
229365 561215You need to join in a tournament first of the greatest blogs on the internet. I will recommend this internet web site! 340740