Switch to English

ఓడి గెలిచిన జనసేన.! గెలిచి ఓడిన వైఎస్సార్సీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటును గెలుచుకోగలిగింది జనసేన. ఆ ఎమ్మెల్యే కూడా ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. టీడీపీ నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలోకి దూకేసిన విషయం విదితమే.

ఇంతకీ, వైఎస్సార్సీపీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేంటి.? ఏ అసెంబ్లీలో అయితే కూర్చుని చట్టాలు చేస్తున్నారో, ఆ అసెంబ్లీ వున్న ప్రాంతాన్ని దెయ్యాల రాజధాని అంటున్నారు వైసీపీ నేతలు, అందునా మంత్రులు. అమరావతిని స్మశామన్నారు, ముంపు ప్రాంతంగా అభివర్ణించారు, ఎడారి అని కూడా అన్నారు. అక్కడే, ఆ దెయ్యాల రాజధానిలోనే.. ఆ స్మశానంలోనే.. ఆ ముంపు ప్రాంతంలోనే, ఆ ఎడారి ప్రాంతం నుంచే మూడున్నరేళ్ళుగా పాలన చేస్తోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.! ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అంటే.!

ఇంతకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేంటి.? ‘వైఎస్ జగన్ మాట ఇచ్చాడంటే.. తగ్గేదే లే.. మాట తప్పడు.. మడమ తిప్పడు..’ అని వైసీపీ నేతలు అంటుంటారు. ‘మాట తప్పే పరిస్థితి వస్తే, నాయకులకు జనం చెప్పులు చూపించాలి..’ అని ఇదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో సెలవిచ్చారు.

ఏదీ, రాజధాని అమరావతి.? ఏదీ పోలవరం ప్రాజెక్టు.? ఏదీ ప్రత్యేక హోదా.? ఏదీ కడప స్టీలు ప్లాంటు.? ఏదీ దుగరాజపట్నం పోర్టు.? ఇలా ఏ ప్రశ్న వేసినా, జనసేన అధినేత మీద ఎదురుదాడి చేస్తుంటారు వైసీపీ నేతలు.

‘ఓడిపోయి బతికిపోయావ్.. అసెంబ్లీకి వచ్చి వుంటే.. చంద్రబాబు ఏడ్చారు.. నువ్వైతే రోజూ గిక్క తిప్పుకోకుండా ఇంకా గట్టిగా ఏడ్చేవాడివి..’ అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా జనసేనాని మీద సెటైర్లేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఏడుస్తాడు.? చంద్రబాబు అయినా ఏడవాల్సిన ఖర్మ ఏంటి.? ఏడుస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు.

‘మా రాజధాని ఏంటో మాకే తెలియదు..’ అనేంత దయనీయ స్థితిని రాష్ట్ర ప్రజలకు వైసీపీనే కల్పించింది. మాట ఇచ్చాడు, తప్పాడు.. చెప్పులు చూపించడం కాదు కదా.. కనీసం ప్రశ్నించాలనుకుంటున్నా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ప్రజల గొంతుల్ని నొక్కేస్తున్నారన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇంతకీ, ఎవరు గెలిచినట్లు.? 2019 ఎన్నికలో వైసీపీ గెలిచింది.. ఆంధ్రప్రదేశ్ ఓడిపోయింది.! ఇది కదా జరిగింది.? ముఖ్యమంత్రికైనా తెలుసా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు సమాధానం.? సమస్యలు చెప్పుకోవడానికి జనం, జనసేన వద్దకు వెళుతున్నారు. ఇదీ ఓడి గెలవడమంటే.! వైసీపీ సభల నుంచి జనం పారిపోతున్నారు.. ఇదీ గెలిచి ఓడటమంటే.! ఎనీ డౌట్స్.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...