దేశ వ్యాప్తంగా కరోనా పలు విప్లవాత్మక మార్పులకు నాంధి పలికింది. ఈ సమయంలో ఆన్ లైన్ సేవల వినియోగం మరింతగా విస్తరించాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా కోర్టులో పిటీషన్స్ ఆన్లైన్ విధానంలో జరుగుతున్నాయి. అత్యంత కఠినమైన ఈ పరిస్థితుల్లో సుప్రీం కోర్టు కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. కోర్టుకు సంబంధించిన సమన్లు, నోటీసులు, పిటీషన్లు జారీ చేయడం సాదారణంగా అయితే పోస్ట్ వారి పని. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో వాట్సప్ మెయిల్ ద్వారా పంపించడం ఉత్తమంగా సుప్రీం భావిస్తుంది.
గత కొన్నాళ్లుగా ఆన్ లైన్ విధానంలోనే ఇది జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సమన్లను వాట్సప్ లేదా ఫ్యాక్స్ ద్వారా పంపించే అవకాశంను కల్పించారు. సమన్లు ఎవరైతే స్వీకరిస్తారో వారు సమాధానం చెప్పాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. కోర్టు నోటీసులు వాట్సప్లో పంపించిన సమయంలో రెండు బ్లూ టిక్స్ వస్తే వారు స్వీకరించినట్లుగా గుర్తిస్తామని పేర్కొన్నారు. ఒక వేళ వాటికి సమాధానం ఇవ్వకుంటే కోర్టు దిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇకపై ఆన్ లైన్ విధానంలోనే ఇలాంటివి జరిగేలా జనాలు అలవాటు పడాలంటూ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
296874 321769Im having a small difficulty. Im unable to subscribe to your rss feed for some reason. Im using google reader by the way. 874103
411243 165910I adore foregathering valuable info, this post has got me even far more information! . 455434
114732 942842I gotta bookmark this web site it seems quite beneficial . 377241