బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్తో బాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఎంతో మంది హిందీ ఫిల్మ్ మేకర్స్ క్యూ కట్టి ఉన్నారు. సాహో చిత్రంతో బాలీవుడ్లో మరింతగా తన పేరును సుపరిచితం చేసుకున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రభాస్ చేయబోతున్నాడు. ఆ రెండు సినిమాల తర్వాత ఖచ్చితంగా ప్రభాస్ బాలీవుడ్ సినిమా ఉంటుందని అంటున్నారు.
బాలీవుడ్లో ఇటీవల ఒక భారీ ఛారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఛారిత్రాత్మక చిత్రాన్ని చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ బాలీవుడ్కు చెందిన పెద్ద నిర్మాణ సంస్థతో ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. కాని ఆ వార్తలు నిజం కాదని యూవీ క్రియేషన్స్ వారు పేర్కొన్నారు.
తాజాగా యూవీ క్రియేషన్స్ ప్రతినిధులు అనధికారికంగా ఈ విషయమై స్పందిస్తూ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రభాస్ బాలీవుడ్ మూవీకి ఓకే చెప్పలేదు. ఇప్పటి వరకు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్లను ప్రభాస్ విన్నాడు. కాని ఆయన మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క బాలీవుడ్ సినిమాకు సైన్ చేయలేదన్నాడు. ఇటీవల ఓమ్ రౌత్ చెప్పిన కథను కూడా విన్న ప్రభాస్ సైన్ మాత్రం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. నాగ్ అశ్విన్ సినిమా తర్వాతే కొత్త సినిమాకు సంబంధించిన ఒప్పందం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. 2022లో ప్రభాస్, నాగ్ అశ్విన్ల మూవీ విడుదల కాబోతుంది.
646111 679683Rattling clean internet internet site , thanks for this post. 446175
211358 501775Gnarly post mate, maintain the good function, just shared this with ma friendz 667593