Switch to English

బిగ్‌ ట్విస్ట్‌: ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో అరెస్టులు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి లీక్‌ అయిన విషవాయువుల కారణంగా 12 మంది మృత్యువాత పడిన విషయం విదితమే. ఈ ఘటనపై చెలరేగిన రాజకీయ దుమారం అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రి హుటాహుటిన విశాఖకు వెళ్ళి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడమే కాదు, గ్యాస్‌ ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం విదితమే.

అయితే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు విమర్శించాయి. కాగా, ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై తాజాగా హైపవర్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. నివేదికలో, పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం తేటతెల్లమయిన దరిమిలా, ఈ కేసులో అరెస్టులు షురూ అయ్యాయి. ఎల్జీ పాలిమర్స్‌ సీఈవో సున్‌కీ జియాంగ్‌ సహా 12 మందిని ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయినవారిలో డైరెక్టర్‌ డీఎస్‌ కిమ్, అడిషనల్‌ డైరెక్టర్‌ మోహనరావు తదితరులున్నారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇదిలా వుంటే, ఎల్జీ పాలిమర్స్‌ ఘటన తర్వాత ఆ ఘటనలో చనిపోయినవారి మృతదేహాలతో పరిశ్రమ యెదుట అప్పట్లో నిరసనకు దిగాయి బాధిత కుటుంబాలు. ఈ క్రమంలో పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారనీ, దోషుల్ని తప్పిస్తున్నారనీ విపక్షాలు విమర్శలు చేసిన విషయం విదితమే. ఏదిఏమైనా, ఎల్జీ పాలిమర్స్‌ ఘటన.. అత్యంత బాధాకరం. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఘటన అది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడంతోపాటు, విషవాయువుల లీక్‌ కారణంగా భవిష్యత్తులో అక్కడి ప్రజలకు ఎదురయ్యే దుష్పరిణామాల పట్ల కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వుంది.

మరోపక్క, 12 మంది మృతికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. మొత్తమ్మీద, ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో సంస్థ ప్రతినిథుల్ని అరెస్ట్‌ చేయడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని కొంతమేర నిరూపించుకుందన్నది నిర్వివాదాంశం.

బిగ్‌ ట్విస్ట్‌: ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో అరెస్టులు.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...