Sriranga Neethulu: సుహాస్, కార్తీక్రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీరంగనీతులు’ (Sriranga Neethulu). రాధావి ఎంటర్టైన్మెంట్స్ పై వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించగా.. ప్రవీణ్కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 11న విడుదల కాబోతున్న సినిమాకు సంబంధించిన ట్రైలర్ శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేశారు.
హీరో సుహాస్.. ‘శ్రీరంగనీతులు ఒక ఇదొక ఆంథాలజి సినిమా. ప్రవీణ్ చాలా కష్టపడి చేశాడు. ప్రేక్షకులకు మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మా ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాన’ని అన్నారు.
విరాజ్ అశ్విన్.. ‘శ్రీరంగనీతులు’కు కథే హీరో. దర్శకుడు ప్రవీణ్ లో మంచి రచయిత కూడా ఉన్నాడు. మంచి కథను అందరికీ కనెక్టయ్యేలా ప్రవీణ్ తెరకెక్కించారు. సినిమాలో నటించినందుకు ఆనందంగా వుంద’ని అన్నారు.
రుహాని శర్మ.. ‘సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది. అందరూ తమని తాము సినిమాలో చూసుకుంటారు. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించార’ని అన్నారు.
నిర్మాత వెంకటేశ్వరరావు బల్మూరి.. ‘దర్శకుడు ప్రవీణ్ కుమార్ నా స్నేహితుడు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించి మంచి సినిమాగా మలిచాడు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంద’ని అన్నారు.