ప్రతీ ఏడాదీ భారతీయ ప్రభుత్వం పద్మ అవార్డులతో మహానీయులను గౌరవిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది పద్మ పురస్కారాల కోసం పేర్లను సెప్టెంబర్ 15 లోగా రికమెండ్ చేయాలని ప్రభుత్వం కోరింది.
ఇక సోషల్ మీడియాలో బ్రహ్మాజీ దీనిపై స్పందించాడు. కరోనా సమయంలో తన సేవలతో ఎన్నో వేల మందికి సహాయం చేసిన సోను సూద్ కు పద్మ విభూషణ్, రెండో అత్యున్నత పురస్కారాన్ని అందించాల్సిందిగా బ్రహ్మాజీ కోరుతున్నాడు. తనతో అంగీకరించే వారు తన ట్వీట్ కు రీట్వీట్ చేయాలని కోరాడు.
ఈ ట్వీట్ కు సోను సూద్ కూడా స్పందించాడు. తనకు ఎలాంటి అవార్డులు అవసరం లేదని 135 కోట్ల భారతీయుల ప్రేమ చాలని, అది తనకు ఇప్పటికే దక్కిందని అంటున్నాడు. సోను సూద్ నిజంగానే పద్మ పురస్కారానికి అర్హుడని కొన్ని లక్షల మంది అభిప్రాయపడుతున్నారు. ఎంతో మందికి లెక్క లేకుండా సహాయం చేసాడు మరి సోను సూద్.
744608 801956The place else may just anybody get that type of info in such a perfect method of writing? 930766
667935 849169I like this site quite significantly so a lot great information. 686848