కరోనాతో ప్రముఖులు ఇప్పటికే పలువురు మృతి చెందారు. ఆ జాబితాలో మరో వ్యక్తి కూడా చేరాడు. సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి తనయుడు ఆశిష్ ఏచూరి కరోనాతో మృతి చెందారు. ఆశిష్ కు ఇటీవలే కరోనా సోకింది. ఆయన ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి తుది శ్వాస విడిచారు. ఆశిష్ మృతి ని సీతారాం ఏచూరి స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
సీతారాం ఏచూరి ట్విట్టర్ లో.. నేడు ఉదయం నా పెద్ద కొడుకు ఆశిష్ ఏచూరి కరోనాతో మృతి చెందారు. అతడిని కాపాడేందుకు వైధ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. వారందరికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. వైధ్యులు, నర్సులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇలా ప్రతి ఒక్కరు కూడా మాకు అండగా నిలిచారు. వారందరికి కూడా కృతజ్ఞతలు అంటూ సీతారాం ఏచూరి పేర్కొన్నాడు. 34 ఏళ్ల ఆశిష్ ఒక మీడియా సంస్థలో ఎడిటజర్గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం పట్ల ఏచూరి సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
95583 587690This is going to be an excellent internet site, might you be interested in performing an interview about how you developed it? If so e-mail me! 895397