కరోనా మహమ్మారి వారు వీరు అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎంతో మంది సెలబ్రెటీలు కరోనా కారణంగా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ తన భర్త ఆండ్రీకు కరోనా లక్షణాలున్నాయంటూ చెప్పుకొచ్చింది. గత రెండు మూడు రోజులుగా శ్రియ భర్త విషయంలో సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈమె ఒక ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ ఆ వార్తలపై స్పందించింది.
ఆమె మాట్లాడుతూ.. ఆండ్రీకి గత రెండు మూడు రోజులుగా దగ్గు ఇంకా జ్వరంగా ఉంది. దాంతో అనుమానం వచ్చి మేము వెంటనే హాస్పిటల్కు వెళ్లాం. అక్కడ మేము త్వరగా రావడంను అభినందించారు. అక్కడ టెస్టులు నిర్వహించి మమ్ములను ఇంటికి పంపించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హాస్పిటల్స్ లో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని అందుకే ఇంటి నుండే మేము చెప్పే సలహాలు పాటించండి అంటూ చెప్పి పంపించారట.
ప్రస్తుతం ఇంట్లో ఉంటూ ఐసోలేషన్ అవుతున్నట్లుగా పేర్కొంది. ప్రస్తుతానికి ఆండ్రీ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరిద్దరు కూడా స్పెయిన్లో ఉన్నారట. అక్కడ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతోంది. మార్చి 13న మా పెళ్లి రోజును జరుపుకునేందుకు రెస్టారెంట్ను బుక్ చేసుకోగా అప్పుడు బయట ఉన్న పరిస్థితి అర్థం అయ్యింది. దేశం మొత్తం పూర్తిగా లాక్డౌన్ అయ్యింది. ఎక్కడ ఏమీ ఓపెన్ చేసి లేవు. ఇలాంటి సమయంలో ఇంటికి కేవలం ఒక్కరినే బయటకు వెళ్లనిస్తున్నారని పేర్కొంది.
994609 2840I adore reading and I conceive this website got some genuinely utilitarian stuff on it! . 848922
16627 83335A lot of thanks for sharing this fine piece. Very fascinating tips! (as always, btw) 566122
559676 574734As I web site owner I believe the articles here is rattling superb , thanks for your efforts. 361525