కరోనా వైరస్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అస్సలేమాత్రం బేషజాలకు పోవడంలేదు. జాతీయ స్థాయిలో విపక్షాల్ని కలుపుకుపోతున్నారు. మీడియా సంస్థల అధిపతులతో మాట్లాడుతున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడటం అనేది ఆయన ‘బాధ్యత’ అనుకోండి.. అది వేరే విషయం. విపక్షాల్ని కలుపుకుపోయే క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితోనూ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడి వుండొచ్చు.
ప్రధానితో మాట్లాడాల్సి వుందంటూ ప్రధాని కార్యాలయానికి టీడీపీ అధినేత సమాచారం ఇవ్వడంతో, ప్రధాని స్వయంగా చంద్రబాబుకి ఫోన్ చేయడం.. చంద్రబాబు ఆ విషయాన్ని మీడియా ముందుకొచ్చి (వీడియో కాన్పÛరెన్స్ ద్వారానే లెండి) చెప్పుకోవడం తెలిసిన విషయాలే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో, ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ, చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ పెద్ద రచ్చే జరిగింది. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పుకుని వాపోయారు.. నరేంద్ర మోడీపై దుమ్మెత్తి పోశారు. అది గతం. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది కరోనా వైరస్ కారణంగా. ఇప్పుడు అందర్నీ కలుపుకుపోవడం తప్ప ప్రధాని నరేంద్ర మోడీకి వేరే మార్గం లేదు.
ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే, అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. బహుశా ఆ కోణంలోనే ప్రదాని నరేంద్ర మోడీ, ఓ మెట్టు దిగి చంద్రబాబుతో మంతనాలు జరిపారని అనుకోవచ్చేమో.! కానీ, దీన్ని వైఎస్సార్సీపీ ఇంకో కోణంలో ప్రొజెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ‘చంద్రబాబు బతిమాలుకుంటే, ప్రధాని మోడీ దయతలిచారు’ అని చెబుతూనే, అదేదో ఘనకార్యమన్నట్లు చంద్రబాబు పబ్లిసిటీ చేసుకోవడమేంటని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఎద్దేవా చేసేశారు సోషల్ మీడియాలో.
గతంలో ప్రధాని, విజయసాయిని పలకరిస్తే.. దాన్ని గొప్పగా చెప్పుకున్న ఘనుడు ఈ విజయసాయిరెడ్డి. ‘కరోనా వైరస్’ని చిన్నపాటి జ్వరంగా అభివర్ణించిన వైఎస్ జగన్ మోహన్రెడ్డితో పోల్చితే, ఈ విషయంలో చంద్రబాబు చాలా బెటర్ అని నరేంద్ర మోడీ భావించారేమో.. అన్న చర్చ టీడీపీ వర్గాల నుంచి సోషల్ మీడియాలో జరుగుతోంది. అవన్నీ పక్కన పెడితే, జాతీయ స్థాయిలో ముందు ముందు తనకు నైతిక మద్దతు అవసరమని భావించిన మోడీ, చంద్రబాబు సహా.. పాత మిత్రుల్ని కలుపుకుపోవాలనుకుంటున్నారనే ఇంకో వాదన కూడా తెరపైకొస్తోంది.
చంద్రబాబు కూడా, ఒకప్పటి బేషజాల్ని పక్కన పెట్టేసినట్లే కన్పిస్తోంది. ఎందుకంటే, ఆయన అవసరాలు అలాంటివి. చంద్రబాబు – మోడీ కలిసేందుకు అవకాశాలు దాదాపుగా లేకపోయినా, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు వుండరు. ఒకవేళ మోడీ – చంద్రబాబు కలిస్తే మాత్రం, వైసీపీకి ఇబ్బందులు తప్పవన్న భావనతోనే వైసీపీ నేతల నుంచి అక్కసు బయటపడ్తోందని అనుకోవాలేమో.! గతంలో చంద్రబాబు కూడా తాను అధికారంలో వున్నప్పుడు ఇలానే భయపడేవారు.. ఇప్పుడు ఆ భయం వైసీపీలో కన్పిస్తోంది.
186939 291584I genuinely enjoy looking through on this web site , it holds superb articles . 360310
398164 502020There is noticeably a bundle to learn about this. I assume you produced specific good points in functions also. 74519