Switch to English

బాబుతో మోడీ ‘మాటా-మంతీ’.. విజయసాయికేంటి తలనొప్పి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అస్సలేమాత్రం బేషజాలకు పోవడంలేదు. జాతీయ స్థాయిలో విపక్షాల్ని కలుపుకుపోతున్నారు. మీడియా సంస్థల అధిపతులతో మాట్లాడుతున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడటం అనేది ఆయన ‘బాధ్యత’ అనుకోండి.. అది వేరే విషయం. విపక్షాల్ని కలుపుకుపోయే క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితోనూ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడి వుండొచ్చు.

ప్రధానితో మాట్లాడాల్సి వుందంటూ ప్రధాని కార్యాలయానికి టీడీపీ అధినేత సమాచారం ఇవ్వడంతో, ప్రధాని స్వయంగా చంద్రబాబుకి ఫోన్‌ చేయడం.. చంద్రబాబు ఆ విషయాన్ని మీడియా ముందుకొచ్చి (వీడియో కాన్పÛరెన్స్‌ ద్వారానే లెండి) చెప్పుకోవడం తెలిసిన విషయాలే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో, ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ, చంద్రబాబుకి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదంటూ పెద్ద రచ్చే జరిగింది. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పుకుని వాపోయారు.. నరేంద్ర మోడీపై దుమ్మెత్తి పోశారు. అది గతం. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది కరోనా వైరస్‌ కారణంగా. ఇప్పుడు అందర్నీ కలుపుకుపోవడం తప్ప ప్రధాని నరేంద్ర మోడీకి వేరే మార్గం లేదు.

ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే, అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. బహుశా ఆ కోణంలోనే ప్రదాని నరేంద్ర మోడీ, ఓ మెట్టు దిగి చంద్రబాబుతో మంతనాలు జరిపారని అనుకోవచ్చేమో.! కానీ, దీన్ని వైఎస్సార్సీపీ ఇంకో కోణంలో ప్రొజెక్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ‘చంద్రబాబు బతిమాలుకుంటే, ప్రధాని మోడీ దయతలిచారు’ అని చెబుతూనే, అదేదో ఘనకార్యమన్నట్లు చంద్రబాబు పబ్లిసిటీ చేసుకోవడమేంటని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఎద్దేవా చేసేశారు సోషల్‌ మీడియాలో.

గతంలో ప్రధాని, విజయసాయిని పలకరిస్తే.. దాన్ని గొప్పగా చెప్పుకున్న ఘనుడు ఈ విజయసాయిరెడ్డి. ‘కరోనా వైరస్‌’ని చిన్నపాటి జ్వరంగా అభివర్ణించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో పోల్చితే, ఈ విషయంలో చంద్రబాబు చాలా బెటర్‌ అని నరేంద్ర మోడీ భావించారేమో.. అన్న చర్చ టీడీపీ వర్గాల నుంచి సోషల్‌ మీడియాలో జరుగుతోంది. అవన్నీ పక్కన పెడితే, జాతీయ స్థాయిలో ముందు ముందు తనకు నైతిక మద్దతు అవసరమని భావించిన మోడీ, చంద్రబాబు సహా.. పాత మిత్రుల్ని కలుపుకుపోవాలనుకుంటున్నారనే ఇంకో వాదన కూడా తెరపైకొస్తోంది.

చంద్రబాబు కూడా, ఒకప్పటి బేషజాల్ని పక్కన పెట్టేసినట్లే కన్పిస్తోంది. ఎందుకంటే, ఆయన అవసరాలు అలాంటివి. చంద్రబాబు – మోడీ కలిసేందుకు అవకాశాలు దాదాపుగా లేకపోయినా, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు వుండరు. ఒకవేళ మోడీ – చంద్రబాబు కలిస్తే మాత్రం, వైసీపీకి ఇబ్బందులు తప్పవన్న భావనతోనే వైసీపీ నేతల నుంచి అక్కసు బయటపడ్తోందని అనుకోవాలేమో.! గతంలో చంద్రబాబు కూడా తాను అధికారంలో వున్నప్పుడు ఇలానే భయపడేవారు.. ఇప్పుడు ఆ భయం వైసీపీలో కన్పిస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Upasana: ఆవకాయ పట్టిన సురేఖ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

రాజకీయం

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...