తన తండ్రి చితి ఆరకముందే మాజీ సీఎం చంద్రబాబు తన బాబాయ్ అశోక్ గజపతిరాజుకు మన్సాస్ ట్రస్టుని కట్టబెట్టారంటూ సంచయిత ఆరోపించారు. మాన్సాస్ (‘మహారాజా అలోక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్) ట్రస్ట్ చైర్ పర్సన్ అయిన సంచయిత ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, గజపతిరాజుపై తీవ్ర ఆరోపణలు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులు అన్యాక్రాంతం కావడానికి చంద్రబాబు హడావిడిగా ఇచ్చిన జీవోనే కారణమన్నారు.
చైర్మన్ గా అశోక్ గజపతిరాజు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ట్రస్టు ఆర్థికంగా నష్టపోయిందన్నారు. ”ఆనంద గజపతిరాజుగారి పెద్దబిడ్డగా, ఆయన వారసురాలిగా మాన్సాస్ బాధ్యతలను చేపట్టానన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. బాబాయి చర్యల వల్ల విద్యాసంస్థల్లో నాణ్యత పడిపోయిందని ఆరోపించారు. ట్రస్టు భూములు కబ్జాలకు గురవుతుంటే కేసులను వాదించడానికి కనీసం లాయర్ని కూడా నియమించలేదని ఆమె దుయ్యబట్టారు. విశాఖ అడిషనల్ జిల్లా జడ్జి ఇచ్చిన తీర్పే ఇందుకు ఉదాహరణ అని అన్నారు.
మాన్సాస్ లా కాలేజీ క్యాంపస్ను ఐఎల్ఎఫ్ఎస్కు ఉచితంగా ఇవ్వడాన్న ఆమె తప్పుబట్టారు. అదెంత కుంభకోణంలో ఇరుక్కుందో జాతీయస్థాయిలో అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. చంద్రబాబు తన సహచరుడ్ని పొగిడేముందు మా తాతగారు, మా తండ్రిగారి వారసత్వాన్ని ఆయన ఏ విధంగా ధ్వంసం చేశారో తెలుసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇవన్నీ మీ ఇద్దరూ కలిసి చేసినవేనా’ అంటూ చంద్రబాబు, అశోక్ గజపతిరాజుపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో వైరల్ అయింది.
791799 465823I believe 1 of your commercials caused my internet browser to resize, you could nicely want to put that on your blacklist. 780295
226830 739093I recognize theres lots of spam on this internet site. Do you need to have help cleansing them up? I may aid among courses! 116821