Switch to English

బాబాయ్‌ వర్సెస్‌ అమ్మాయ్‌: సింహాద్రి ‘అప్పన్న’ చుట్టూ చిత్రమైన రాజకీయం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు మీదకి బ్రహ్మాస్త్రంలా ఆయన సోదరుడి కుమార్తె సంచైతని ప్రయోగించారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. చిత్రమేంటంటే, సంచైత.. బీజేపీ నేత. రాష్ట్రంలో రాజకీయాలు ఎంత చిత్రంగా వున్నాయో చెప్పడానికి సంచైతకు మన్సాస్‌ ట్రస్ట్‌ బాధ్యతల్ని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అప్పగించడమే నిదర్శనం.

మన్సాస్‌ ట్రస్ట్‌ పరిధిలో పెద్దయెత్తున భూములున్నాయి. పలు దేవాలయాలున్నాయి. వీటన్నిటి మీదా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్ను పడిందన్నది విపక్షాల ఆరోపణ. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే కొందరు బీజేపీ నేతలు కూడా, మన్సాస్‌ ట్రస్ట్‌ బాధ్యతలు సంచైతకు అప్పగించడాన్ని తప్పుపట్టడం. ఇదిలా వుంటే, సంచైత వర్సెస్‌ అశోక్‌ గజపతిరాజు మధ్య రాజకీయ పోరు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. కేవలం అశోక్‌ గజపతిరాజు ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేయడానికే సంచైతను తీసుకొచ్చినట్లుగా నడుస్తోంది వ్యవహారం. ఆమె కూడా, పనిగట్టుకుని బాబాయ్‌ మీద విమర్శలు చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నారు.

మరోపక్క సంచైత, ఆమె తల్లి ఎప్పుడో తమ కుటుంబానికి దూరమైపోయిందనీ, ఆమెకు ఎలాంటి వారసత్వ హక్కులూ లేవని అశోక్‌ గజపతిరాజు ఆరోపిస్తున్నారు. అంతే కాదు, అసలు సిసలు వారసులం తామేనంటూ ఊర్మిళ (అశోక్‌ సోదరుడు ఆనంద గజపతిరాజు మరో కుమార్తె) మీడియా ముందుకొచ్చారు.

ఈ వ్యవహారాలు కాస్సేపు పక్కన పెడితే, ‘ప్రసాద’ పథకం పరిధిలోకి సింహాచలం దేవస్థానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇది తన ఘనతేనని సంచైత చెబుతున్నారు. ఆ క్రెడిట్‌లో కొంత భాగం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికీ ఇస్తున్నారు. అదే సమయంలో, చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించలేదనీ, అశోక్‌ గజపతిరాజు కూడా పట్టించుకోలేదనీ విమర్శించారు.

దానికి కౌంటర్‌ ఇస్తూ అశోక్‌ గజపతిరాజు, 2017లోనే సింహాచలం దేవస్థానం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికీ, కేంద్ర ప్రభుత్వానికీ ‘ప్రసాద’ పథకం విషయమై విన్నవించామని, దాని ఫలితంగానే ఇప్పుడు కేంద్రం, సింహాచలం దేవస్థానానికి తీపి కబురు అందించిందని అంటున్నారు.

సంచైతకు మన్సాస్‌ ట్రస్ట్‌ బాధ్యతలు వచ్చింది ఈ మధ్యనే.. సింహాచలం దేవస్థానం బాధ్యతల్నీ కొద్ది నెలల క్రితమే అందుకున్నారు. ఇంతలోనే ఆమె ఇవన్నీ చేయగలిగారా.? నిజమైతే మంచిదే. కానీ, ఉత్తరాంధ్రకు సంబంధించిన కీలకమైన అంశం రైల్వే జోన్‌. అది ప్రకటితమైందిగానీ.. అమల్లోకి రాలేదు. సంచైతకు రాష్ట్ర ప్రభుత్వ ఆశీస్సులు.. కేంద్రం వద్ద పలుకుబడి వుంటే.. ఆ రైల్వే జోన్‌ వ్యవహారంపై బాధ్యత తీసుకోవచ్చు కదా.? ప్రత్యేక హోదా గురించి మాట్లాడొచ్చు కదా.!

కేంద్రం తరఫున రాష్ట్రానికి ఏమొచ్చినా.. అది తమ ఖాతాలో వేసేసుకోవడం వైసీపీకి అలవాటైపోయింది. ఈ క్రమంలో సంచైత, సింహాచలం క్రెడిట్‌ని తన ఖాతాలో వేసేసుకున్నారు. ఇంటి గొడవలు వుంటే.. అది వేరే సంగతి. ఇంటి గొడవల్ని, రాజకీయాల్ని మిళితం చేసేస్తే ఎలా.? అన్నది ఉత్తరాంధ్రలో సంచైత రాజకీయంపై ప్రముఖంగా విన్పిస్తోన్న విమర్శ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....